సుక్కు-రాజ్ తరుణ్ తో మరోసారి కలవనున్నారా..?

  • September 26, 2016 / 07:06 AM IST

సుకుమార్ దర్శకుడిగా మారాక తనలోని రచయితని సంతృప్తి పరచడానికి చేసిన తొలి ప్రయత్నం ‘కుమారి 21f’. అది సఫలం కావడంతో ఆ కోవలో మరిన్ని సినిమాలు చేయాలనుకుంటున్నట్టు ఈ స్క్రీన్ ప్లే మాస్టర్ ప్రకటించారు. అటు రాజ్ తరుణ్ కెరీర్ లోనూ ఈ సినిమా ప్రత్యేకంగా నిలిచింది. ఇప్పుడు మరోసారి ఈ కాంబినేషన్ రిపీట్ అవుతోందట.

సుకుమార్ రాసుకున్న కథల్లో రాజ్ తరుణ్ కి సరిపడే ఓ కథ ఉందిట. ఈ కథని పూర్తి స్థాయి స్క్రిప్ట్ గా మారుస్తున్నారా సుకుమార్. అయితే ఈ సినిమా నిర్మాణ భాద్యతలు మాత్రం సుకుమార్ చేపట్టడం లేదట. యువ హీరోలతో వరుస సినిమాలు చేస్తున్న 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్ లో ఈ సినిమా ఉంటుందని పరిశ్రమ వర్గాల సమాచారం. ఈ మేరకు సుక్కుతో నిర్మాతలు చర్చలు జరుపుతున్నారట. 14 రీల్స్ సంస్థలో సుకుమార్ 1 నేనొక్కడినే సినిమా చేసిన సంగతి తెలిసిందే. కుమారి సినిమాని తెరకెక్కించిన సూర్య ప్రతాప్ ఈ సినిమాకీ దర్శకత్వం వహిస్తారట. ప్రస్తుతం రాజ్ తరుణ్ చేస్తున్న సినిమాలు పూర్తవగానే ఈ సినీమా సెట్స్ పైకి వెళ్లనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus