హాట్ టాపిక్ గా మారిన యాంకర్ సుమ కామెంట్స్..!

  • January 7, 2020 / 01:49 PM IST

ఓ స్టార్ హీరో ప్రీ రిలీజ్ వేడుక అనగానే.. ఒక్క ప్రీ రిలీజ్ వేడుక అనే కాదు ఏ వేడుక అయినా సరే.. ఆ వేడుకని సుమ యాంకరింగ్ చేస్తే అందం. ఆమె యాంకరింగ్ తో అందరినీ ఆకట్టుకుంటుంటుంది. ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా యాంకర్ సుమకు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది అనడంలో సందేహం లేదు. అలాంటి సుమ.. హీరోయిన్ రష్మిక పై చేసిన కామెంట్ పెద్ద వైరల్ అయ్యింది. ఇటీవల జరిగిన మహేష్ బాబు ‘సరిలేరు నీకెవ్వరు’ ప్రీ రిలీజ్ వేడుకలో ఓ సంఘటన జరిగింది.

ఈ వేడుకకి సుమ యాంకరింగ్ చేసింది. ఈ వేడుకలో హీరోయిన్ రష్మిక ను స్టేజి పైకి ఇన్వైట్ చేసింది సుమ. అయితే ఈ వేడుకకి ముఖ్య అతిధిగా మెగాస్టార్ చిరంజీవి హాజరవ్వడంతో.. మరింతగా జనాలు తరలి వచ్చారు. ఇక స్టేజి పైకి వచ్చిన రష్మిక.. ‘ఇంత మంది జనాల్ని చూస్తే నాకు మాటలు రావడం లేదు’ అని చెప్పింది. ఇంతలో యాంకర్ సుమ అక్కడికి వచ్చి.. ‘పర్వాలేదు.. ఇక్కడ ఎవరి డబ్బా.. వారే కొట్టుకోవాలి.. మాట్లాడు’ అంటూ కామెంట్ చేసింది. అంతే సుమ చేసిన ఈ కామెంట్ పై డిస్కషన్లు మొదలైపోయాయి. అసలు సుమ ఇలా ఎందుకు కామెంట్ చేసింది అంటూ కొందరు నెటిజన్లు డిస్కస్ చేసుకుండడంతో.. ఈ టాపిక్ వైరల్ గా మారింది.


అతడే శ్రీమన్నారాయణ సినిమా రివ్యూ & రేటింగ్!
తూటా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus