పెళ్ళికి రెడీ అవుతున్న మరో హీరోయిన్..?

  • June 6, 2020 / 01:00 PM IST

ఈ లాక్ డౌన్ టైములో సామాన్యులు దగ్గర నుండీ సెలబ్రిటీల వరకూ ఇళ్ళల్లోనే ఉంటూ వస్తున్నారు. ఇక సినీ సెలబ్రిటీలు అయితే షూటింగ్ లు లేక ఖాళీగానే ఉంటున్నారు కాబట్టి.. ఇప్పటి వరకూ వాయిదా వేస్తూ వారి పెళ్ళి సంగతుల పై దృష్టి పెట్టారు. ఇప్పటికే హీరో నిఖిల్ పెళ్ళి చేసుకున్నాడు. దిల్ రాజు రెండో పెళ్ళి కూడా చేసుకున్నాడు. ‘రంగస్థలం’ మహేష్ వంటి చిన్న ఆర్టిస్ట్ కూడా పెళ్ళి చేసుకుని ఓ ఇంటివాడయ్యాడు.

ఇక నితిన్, రానా లు కూడా పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. నయన తార కూడా పెళ్ళికి రెడీ అవుతున్నట్టు టాక్ నడుస్తుంది. ఇంకా ఎంతో మంది హీరో, హీరోయిన్లు, కమిడియన్ లు పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇలాంటి తరుణంలో సునీల్ హీరోయిన్ కూడా పెళ్ళి చేసుకోబోతుందని తెలుస్తుంది. సునీల్ హీరోగా క్రాంతి మాధవ్ డైరెక్షన్లో తెరకెక్కిన ‘ఉంగరాల రాంబాబు’ చిత్రంలో హీరోయిన్ గా నటించిన మియా జార్జ్ అందరికీ గుర్తుండే ఉంటుంది.

మలయాళంలో ఈమె స్టార్ హీరోయిన్ గా రాణిస్తుంది. ఇక మియా జార్జ్ కు ప్రముఖ వ్యాపారవేత్త అశ్విన్ ఫిలిప్‌తో నిశ్చితార్ధం జరిగినట్టు తెలుస్తుంది. అతి త్వరలో ఈమె కూడా పెళ్ళి చేసుకోబోతుందట. తన ఇన్స్టా గ్రామ్ ద్వారా మియా జార్జ్ ఈ విషయాన్ని తెలిపింది. ఇక ఈమె పెళ్ళి సెప్టెంబర్ లో ఉంటుందని తెలుస్తుంది.

Most Recommended Video

మేకప్‌ లేకుండా మన టాలీవుడ్ ముద్దుగుమ్మలు ఎలా ఉంటారో తెలుసా?
జ్యోతిక ‘పొన్‌మగల్‌ వందాల్‌’ రివ్యూ
ఈ డైలాగ్ లు చెప్పగానే గుర్తొచ్చే హీరోయిన్లు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus