త్రివిక్రమ్ స్కెచ్ వేశాడంటే..

  • December 26, 2020 / 03:04 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు బెస్ట్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన క్రేజ్ అందుకున్న స్టార్ కమెడియన్ సునీల్. అయితే సునీల్ హీరోగా అడుగులు వేసి ఆ స్టార్ డమ్ ను ఎక్కువ రోజులు ఆస్వాదించలేకపోయాడు. అయితే ఇటీవల మళ్ళీ కమెడియన్ గా యూ టర్న్ తీసుకున్న సునీల్ గతంలో మాదిరిగా అయితే క్లిక్కవ్వలేదు. కానీ విలన్ గా మాత్రం క్లిక్కయ్యాడు. మొదటిసారి కలర్ ఫొటో సినిమా ద్వారా పూర్తిగా విలన్ పాత్రలో కనిపించి

అభిమానులకు సరికొత్త కిక్కిచ్చిన సునీల్ రానున్న రోజుల్లో మరింత క్రూరమైన విలన్ గా మరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక తన ప్రాణ స్నేహితుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కూడా సరికొత్త స్కెచ్ వేసినట్లు తెలుస్తోంది. కమెడియన్ గా సునీల్ క్రేజ్ పెరగడానికి ముఖ్య కారణం.. త్రివిక్రమ్ అప్పట్లో అతనికోసం క్రియేట్ చేసిన పాత్రలనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఫైనల్ గా నెక్స్ట్ డైరెక్ట్ చేయబోయే సినిమాలో కూడా త్రివిక్రమ్ సునీల్ కు కమెడియన్ గా ఒక రోల్ ఇవ్వాలని అనుకున్నాడు.

కానీ కలర్ ఫొటోలో సునీల్ నటనకు ఫిదా అయిన త్రివిక్రమ్ మనసు మార్చుకున్నారట.. సునీల్ లోని నెగిటివ్ షేడ్స్ ను వాడుకోవాలని డిసైడ్ అయ్యారట. ఇక ఎన్టీఆర్ తో చేయబోయే సినిమాలో పురిగా విలన్ పాత్ర కోసం సునీల్ ని ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేయిట్ చేయాల్సిందే.

Most Recommended Video

2020 Rewind: ఈ ఏడాది సమ్మోహనపరిచిన సుమధుర గీతాలు!
కొన్ని లాభాల్లోకి తీసుకెళితే.. మరికొన్ని బోల్తా కొట్టించాయి!
2020 Rewind: ఈ ఏడాది డిజాస్టర్ సినిమాలు ఇవే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus