కళ్యాణ్ రామ్ నిర్ణయానికి షాక్ తిన్న సునీల్

  • February 18, 2017 / 01:43 PM IST

హాస్యనటుడు స్థాయి నుంచి హీరోగా ఎదిగిన సునీల్ ప్రస్తుతం అపజయాలతో ఇబ్బందులు పడుతున్నాడు. ఎంతో అలోచించి ఎంచుకున్న కథలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా కొడుతుండడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు. తాజాగా సునీల్ ‘ఉంగరాల రాంబాబు’ సినిమాపై ఆశలు పెట్టుకున్నారు. యునైటెడ్ కిరీటి మూవీస్ పతాకంపై క్రాంతిమాధవ్ దర్శకత్వంలో పరుచూరి కిరీటి నిర్మిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం తర్వాత చేయడానికి సునీల్ ఓ అద్భుత కథను సెలక్ట్ చేసి పెట్టుకున్నారు. ఆ కథను ప్రస్తుతం నందమూరి కళ్యాణ్ రామ్ ఎగరేసుకుపోయినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న సునీల్ షాక్ తిన్నాడంట.

ఈ సీన్ పూర్తిగా అర్ధం కావాలంటే .. కొంత ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లాల్సి ఉంటుంది.  శ్రీను వైట్ల , అనిల్ రావిపూడి వద్ద అసిస్టెంట్ డైరక్టర్ గా పనిచేసిన ఉపేంద్ర డైరక్టర్ గా లాంచ్ కావడానికి అద్భుత కథను రెడీ చేసుకున్నాడు. కొన్ని నెలల క్రితం ఈ స్టోరీ ని  హీరో సునీల్ కు చెప్పాడు. ఆ స్టోరీ సునీల్ కు కూడా బాగా నచ్చింది. చేద్దామనుకుంటే ప్రొడ్యూసర్ దొరకక ఇబ్బందులు పడ్డారు. ఇక ఉపేంద్ర లాభం లేదనుకొని అదే క‌థ‌ను క‌ళ్యాణ్‌రామ్‌కు చెప్పి ఓకే చేయించుకున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెప్పుకుంటున్నారు. ఇలా కళ్యాణ్ రామ్ తీసుకున్న నిర్ణయానికి సునీల్ షాక్ తిన్నారు.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus