‘చిత్ర లహరి’ తో మెట్రోలో సందడి చేస్తున్న తేజు

  • December 16, 2018 / 02:41 AM IST

మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ‘సుప్రీం హీరో’ సాయి ధరమ్ తేజ్ హీరోగా తెరకెక్కుతోన్న తాజా చిత్రం ‘చిత్రలహరి’. ‘సెకండ్ హ్యాండ్’ ‘నేను శైలజ’ ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి డీసెంట్ చిత్రాలని తెరకెక్కించిన కిషోర్ తిరుమల ఈ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్నారు. కల్యాణి ప్రియదర్శన్, నివేదా పేతురాజ్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకుందట.

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నట్టు సమాచారం. తాజాగా హైదరాబాద్ మెట్రో ట్రైన్లో కూడా కొన్ని సీన్లని షూట్ చేశారట. మియాపూర్ టు ఎల్బీ నగర్ లైన్లో వెళ్తున్న ట్రైన్లో ఈ సీన్లను రూపొందించారట. ఈ చిత్రంలో సునీల్ కూడా నటించబోతున్నాడట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సమ్మర్ కానుకగా విడుదల చేయడానికి చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నట్టు సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus