రజినీ సినిమా ఎఫెక్ట్ కమల్ సినిమా పై పడింది..!

  • February 19, 2019 / 02:26 PM IST

రజినీ కాంత్ – శంకర్ కాంబినేషన్లో వచ్చిన భారీ బడ్జెట్ చిత్రం ‘2.0’. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ చిత్రం 2018 నవంబర్ 29 న విడుదలయ్యింది. అనేక కారణాల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన కారణంగా ఈ చిత్రం ఆశించిన స్థాయిలో కలెక్షన్లను రాబట్టలేకపోయింది. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లలో విడుదలైనప్పటికీ.. సినిమాకి మంచి మౌత్ టాక్, రివ్యూలు వచ్చినప్పటికీ.. కూడా మంచి విజయాన్ని నమోదు చేయలేకపోయింది.

దీనికి ప్రధాన కారణం అనుకున్న సమయంలో సినిమాని పూర్తి చేయకపోగా…. ఈ చిత్రాన్ని నవంబర్ వంటి డ్రై సీజన్లో విడుదల చేయడం వంటివేనట. ఇక ఈ చిత్రాన్ని నిర్మించిన ‘లైకా ప్రొడక్షన్స్’ సంస్థకి దాదాపు 100 కోట్ల నష్టం వాటిల్లిందట. ఇక లెక్కలు చూసుకున్న నిర్మాతలు .. ‘ఇండియన్ 2’ చిత్ర నిర్మాణం విషయంలో శంకర్ కి ఒక షరతు పెట్టారట. 250 కోట్లలోపు ఖర్చుతో ఫస్టుకాపీ చేతిలో పెడతానని అగ్రిమెంట్ చేయమన్నారట నిర్మాతలు. శంకర్ ముందు నిరాకరించినప్పటికీ తరువాత… ఆ స్థాయి నిర్మాతలు దొరకడం కూడా కష్టమేనని భావించి అగ్రిమెంట్ కి అంగీకరించారని కోలీవుడ్ మీడియా వర్గాల సమాచారం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus