Supriya Yarlagadda: ఏపి ప్రభుత్వం తీరు పై స్పందించిన సుప్రియ యార్లగడ్డ!

  • November 25, 2021 / 03:01 PM IST

అక్కినేని నాగేశ్వర రావు గారి మనవరాలిగా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన సుప్రియ యార్లగడ్డ.. అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి, గూఢచారి, వంటి సినిమాల్లో నటించింది కానీ.. అంతకు మించి నటిగా ముందుకు వెళ్ళలేకపోయింది. అయితే అన్నపూర్ణ స్టూడియోస్ లోని కీలక బాధ్యతల్ని నిర్వహిస్తూనే మరో పక్క కథలు వినడం, నచ్చిన కథల్ని… ఫైనల్ చేసి నిర్మించడం వంటివి చేస్తుంది.ఈ క్రమంలో రాజ్ తరుణ్ తో అనుభవించు రాజా అనే చిత్రాన్ని నిర్మించింది.శ్రీను గవిరెడ్డి ఈ చిత్రానికి దర్శకుడు.

నవంబర్ 26 న విడుదల కాబోతున్న ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్లు ఓ రేంజ్లో నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా రిలీజ్ కు ముందు ఏర్పాటు చేసిన ఓ వేడుకలో టికెట్ రేట్ల ఇష్యూ పై సుప్రియ చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె మాట్లాడుతూ…” టికెట్ రేట్లు పెంచడం తగ్గించడం అనేది ఏపి ప్రభుత్వం ఇష్టం. ఎంతమంది .. ఎన్ని రిక్వెస్ట్ లు పెట్టినా… సమావేశాల్లో పాల్గొన్నా.. వాళ్ళు కన్విన్స్ అవ్వకపోతే ఏం చేస్తాం.

టికెట్ లు ఎలా అమ్ముకుంటారు అనేది పూర్తిగా వాళ్ళ పర్సనల్ ఇష్యూ అయిపోయింది. రేట్లు తగ్గిస్తారా పెంచుతారా అన్నది కూడా వాళ్ళ ఇష్టం. వాళ్ళని కాదని మేము ఏమి చేయలేము.. ఎంత మాట్లాడినా ఉపయోగం లేదు” అంటూ చెప్పుకొచ్చింది సుప్రియ.

నాగ చైతన్య రిజెక్ట్ చేసిన 10 సినిమాల్లో 3 బ్లాక్ బస్టర్లు…!

Most Recommended Video

టాలీవుడ్ ప్రేక్షకులను అలరించిన 10 సైన్స్ ఫిక్షన్ మూవీస్ ఇవే..!
ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
ఈ 15 మంది హీరోయిన్లు విలన్లుగా కనిపించిన సినిమాలు ఏంటో తెలుసా..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus