దర్శకుడు సురేంధర్ రెడ్డి లైన్ అప్ క్రేజీ బజ్..!

  • August 18, 2020 / 08:53 PM IST

టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్న సురేంధర్ రెడ్డి అతనొక్కడే, కిక్, రేసు గుర్రం లాంటి భారీ హిట్స్ అందుకున్నారు. ఇక గత ఏడాది మెగాస్టార్ చిరంజీవితో ఆయన చేసిన పాన్ ఇండియా చిత్రం సైరా ఇతర భాషలలో ఆదరణ దక్కించుకోకపోయినప్పటికీ తెలుగులో మాత్రం టాప్ గ్రాసర్స్ లో ఒకటిగా నిలిచింది. కెరీర్ బిగినింగ్ నుండి స్టార్ హీరోలతోనే సినిమాలు చేసిన సురేంధర్ రెడ్డి సైరా తరువాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ప్రకటించలేదు.

ఆయన ప్రభాస్, మహేష్, చరణ్ లాంటి హీరోల కోసం ప్రయత్నించినా ఏది వర్క్ అవుట్ కాలేదు. దీనితో ఆయన అక్కినేని యంగ్ హీరో అఖిల్ తో ఓ భారీ ప్రాజెక్ ప్లాన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. అఖిల్ నెక్స్ట్ మూవీ కోసం ఆయన ఏకంగా 45కోట్ల బడ్జెట్ అడిగారట. ఇది ఓ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా బడ్జెట్ కాస్ట్ 45 కోట్లుగా చెప్పారట. క్రిష్ ప్రొడక్షన్ హౌస్ అయిన ఫస్ట్ ఫ్రేమ్ ఎంటెర్టైనెంట్స్ ఈ చిత్రాన్ని నిర్మించాల్సి ఉండగా, బడ్జెట్ లెక్కల తరువాత సందిగ్ధంలో పడ్డారట.

అయినప్పటికీ ఈ చిత్రం పట్టాలెక్కడం ఖాయం అంటున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ కోసం సురేందర్ రెడ్డి ఓ స్క్రిప్ట్ సిద్ధం చేస్తున్నారట. నిర్మాత రామ్ తాళ్లూరి ఈ ప్రాజెక్ట్ నిర్మించే అవకాశం కలదట. పవన్ పూర్తి చేయాల్సిన ప్రాజెక్ట్స్ ఉన్న నేపథ్యంలో, మొదట అఖిల్ మూవీ పూర్తి చేసి, తరువాత పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలనేది సురేందర్ రెడ్డి ప్లాన్ అట.

Most Recommended Video

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus