సెన్సార్ కార్యక్రమాల్లో సూర్య “24”

  • April 26, 2016 / 10:09 AM IST

సూర్య త్రిపాత్రాభినయం చేస్తూ నిర్మించిన “24” సినిమా ప్రస్తుతం సెన్సార్ జరుపుకుంటోంది. చెన్నై సెన్సార్ బృందం ఈ చిత్రాన్ని అక్కడి ప్రివ్యూ థియేటర్ లో వీక్షిస్తొంది. సూర్య సరసన సమంత, నిత్యామీనన్ లు కథానాయికలుగా నటిస్తున్న ఈ చిత్రానికి విక్రమ్ కుమార్ దర్శకుడు. మే 6న తమిళంతోపాటు తెలుగులోనూ ఏకకాలంలో విడుదల కానున్న ఈ చిత్రానికి సెన్సార్ బోర్డ్ నుంచి “యు/ఎ” సర్టిఫికేట్ ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు చిత్ర బృందం.

మరి కొద్ది గంటల్లోనే సెన్సార్ సర్టిఫికేట్ తోపాటు.. సినిమా టాక్ కూడా తెలిసిపోనుండడంతో.. “24” చిత్రానికి నిర్మాత మరియు కథానాయకుడు అయిన సూర్యతోపాటు.. ఈ సినిమా కోసం ఎంతో ఆత్రంగా ఎదురుచూస్తున్న వాళ్లందరూ ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus