పవన్ కి ఓట్లు ఎంతవస్తాయో సర్వేలు దాస్తున్నాయన్న నాగబాబు

  • September 4, 2017 / 12:39 PM IST

యువతలో ఎక్కువ ఫాలోయింగ్ ఉన్న హీరో పవన్ కళ్యాణ్. అతను సపోర్ట్ ఇవ్వడం వల్లనే గత ఎన్నికల్లో టీడీపీ గెలిచిందనేది అభిమానుల నమ్మకం. ఇప్పుడు పవన్ స్థాపించిన జనసేన పార్టీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ పడనుంది. 2019 ఆంధ్రపరదేశ్ ఎన్నికల్లో ఎవరికెన్ని సీట్లు వస్తాయో అనే దానిపై ఇప్పటి నుంచే సర్వేలు చేస్తున్నారు. తమ పార్టీ గెలుస్తుందని దేనికదే ప్రకటించుకున్నాయి. దీనిపై మెగా బ్రదర్ నాగబాబు ఓ ఇంటర్వ్యూ లో స్పందించారు. ” పోల్ సర్వేల్లో ఒక్కొక్కరు ఒక్కోమాట చెబుతున్నారు. ఒకరు టీడీపీకి ఎక్కువ సీట్లు వస్తాయని చెబుతుంటే.. మరొకరు వైసీపీకి బ్రహ్మాండంగా వస్తాయని చెబుతున్నారు. కల్యాణ్ బాబు గురించి కొంతమందే చెప్పారు.

వీళ్లందరికీ అర్థం అవ్వాల్సింది ఏంటంటే.. వైసీపీ, టీడీపీ వాళ్లు విజబుల్‌గా కనిపిస్తున్నారు. కానీ, అండర్‌లైన్‌లో పవన్ కి ఎంత ఫాలోయింగ్ ఉందనేది మాకు తెలుసు. కానీ దాన్ని ఎవరూ బయటకు చెప్పడం లేదు. చెప్తే ఎక్కడ దొరికిపోతామో అని చెప్పట్లేదు. ఆ ఫాలోయింగ్‌ను ఊహించడం కూడా కష్టం.’’ అని చెప్పారు. నాగబాబు మాటలను పవన్ ఫ్యాన్స్ స్వాగతిస్తుండగా, మెగాస్టార్ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. మెగా అభిమానులందరూ ఒక్కటేనని నాగబాబు సముదాయించే పనిలో ఉన్నారు. మెగా ఫ్యాన్స్, పవన్ ఫ్యాన్స్ ని కలిపి జనసేనను మరింత బలమైన పార్టీగా చేయాలనీ కష్టపడుతున్నారు.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus