బిగ్‌బాస్‌ 4: ‘అతి జోక్యం’ కొంప ముంచేసింది!

  • September 16, 2020 / 01:48 PM IST

బిగ్‌బాస్‌ నాలుగో సీజన్‌ తొలి ఎలిమినేషన్‌ అయిపోయింది. రాత్రి 9 గంటలకు నాగార్జున వచ్చి… హౌస్ మేట్స్ ని నవ్వించి, ఆడించి… ఒకరిని బయటకు తీసుకొచ్చేశాడు.. అదేనండి ఎలిమినెట్ చేశారు. ఎలిమనేషన్‌ జోన్‌లో ఉన్న దివి, మెహబూబ్, అఖిల్, సూర్య కిరణ్‌లో ఆఖరి వ్యక్తిని బయటకు తీసుకొచ్చేశారు. అందరూ ముందుగా అనుకుంటున్నట్లుగానే సూర్యకిరణ్‌ తొలి ఎలిమినేట్‌ హౌస్‌మేట్‌గా బయటకు వచ్చేశాడు.

మెహబూబ్‌, అఖిల్‌ను ముందుగా సేఫ్‌ చేసిన నాగార్జున ఆఖరికి దివి, సూర్యకిరణ్‌ ఎలిమినేట్‌ జోన్‌లో ఉంచాడు. ఇద్దరిలో తక్కువ ఓట్లు వచ్చిన సూర్యకిరణ్‌ను ఎలిమినేట్‌ చేస్తున్నట్లు ప్రకటించాడు. సూర్యకిరణ్‌ బాధను నొక్కిపట్టి బయటకు వెళ్లగా… మోనాల్‌ కన్నీళ్లు పెట్టుకుంది. అయితే సూర్యకిరణ్‌ ఇంట్లో ఉండటానికి ఇబ్బందిపడుతున్నాడని, తన పాస్ట్‌ స్ట్రగుల్స్‌ వల్ల ఆందోళనగా ఉన్నాడని.. బయటకు వెళ్లి మంచిగా సినిమాలు చేసుకోవాలని అమ్మ రాజశేఖర్‌ కెమెరా ముందుకొచ్చి చెప్పారు.

మొదటి రోజు నుంచి సూర్యకిరణ్‌ అంటే ఇంట్లో ఎవరికీ సరైన అభిప్రాయం లేదు. అందరి మీద అజమాయిషీ చలాయించాలని చూడటం, ఏ ఇద్దరు మాట్లాడుతున్నా మధ్యలోకి వెళ్లి తను చెప్పించే చేయాలి అనడం లాంటివి సూర్యకిరణ్‌ను ఇంట్లో బ్యాడ్‌ చేశాయి. అంతేకాదు… బయట జనాలకు కూడా సూర్యకిరణ్‌ మీద సదభిప్రాయం లేకుండా చేశాయి. అందుకే ఆశించినన్ని ఓట్లు వేయలేదు.

Click Here To Watch

Most Recommended Video

బిగ్‌బాస్ 4 కంటెస్టెంట్స్ గురించి మీకు తెలియని ఆసక్తికరమైన విషయాలు!
బిగ్‌బాస్ ఇంట్లో అభిజీత్‌ లాంటోడు ఉండాల్సిందే!
బిగ్ బాస్ 4 నామినేషన్: కిటికీల ఆటలో తలుపులు మూసేసింది ఎవరికంటే?

Read Today's Latest Bigg Boss Telugu Update. Get Filmy News LIVE Updates on FilmyFocus