డ్రగ్ కేసులో సంచలన వాస్తవాలు, రియా అరెస్ట్ కి రంగం సిద్ధం..!

  • September 5, 2020 / 04:25 PM IST

సుశాంత్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. నిషేధిత డ్రగ్స్ వాడిన కేసులో రియా చక్రవర్తి తమ్ముడు షోవిక్ చక్రవర్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. షోవిక్ తో పాటు సుశాంత్ ఇంటి మేనేజర్ శామ్యూల్ మిరిండాను కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కొందరు డ్రగ్ డీలర్ల నుండి వీరు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు ఆధారాలు లభించడంతో వీరిని అరెస్ట్ చేశారు. ఇక ఈ డ్రగ్ కొనుగోళ్ల కోసం రియా చక్రవర్తి క్రెడిక్ కార్డు వాడినట్లుగా తెలియడంతో రియా అరెస్ట్ కావడం తప్పదని వార్తలు వస్తున్నాయి.

రెండు నెలల క్రితం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య చేసుకొని మరణించగా కుటుంబ సభ్యులు ఆయన మృతిపై అనుమానాలు వ్యక్తం చేయడం జరిగింది. సుశాంత్ మృతికి హీరోయిన్ రియా చక్రవర్తి కారణం అని వారు కేసు నమోదు చేశారు. ఈ కేసు ఉన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు సీబీఐకి అప్పగించడం జరిగింది. అనేక కోణాలలో ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తున్న సీబీఐ సుశాంత్ డ్రగ్స్ వాడుతారని తెలుసుకున్నారు.

అలాగే సుశాంత్ తో పాటు రియా, ఆమె తమ్ముడు షోవిక్ అలాగే శామ్యూల్ మిరాండా ఇంటి టెర్రస్ పై గంజాయి తాగేవారని అక్కడ పనిచేసే వారు చెప్పడం జరిగింది. దీనితో రియాకు డ్రగ్ డీలర్లతో గల సంబంధాలపై ఆరా తీయగా కొన్ని సంచలన విషయాలు బయటికి రావడం జరిగింది.

Most Recommended Video

వి సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ హీరోయిన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్…!
ఆ చిత్రాలు పవన్ చేసి ఉంటే బాక్సాఫీస్ బద్దలు అయ్యేది..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus