వైరల్ అవుతున్న ఎస్వీ కృష్ణారెడ్డి షాకింగ్ కామెంట్స్!

  • March 3, 2023 / 02:56 PM IST

టాలీవుడ్ ఇండస్ట్రీలోని టాప్ డైరెక్టర్లలో ఒకరైన ఎస్వీ కృష్ణారెడ్డి గత కొన్నేళ్లుగా డైరెక్షన్ కు దూరంగా ఉన్నారు. ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో ఈ దర్శకుడు రీఎంట్రీ ఇస్తుండగా సోహెల్ హీరోగా భారీ బడ్జెట్ తోనే ఈ సినిమా తెరకెక్కింది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎస్వీ కృష్ణారెడ్డి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. నా జీవితంలో నేను రెండు పెద్ద తప్పులు చేశానని ఆయన అన్నారు.

నాగార్జునతో సినిమా తీయాలని మొదట ఒక కథ ఆయనకు చెప్పానని ఆ కథ నాగార్జునకు కూడా నచ్చడంతో ఆయన వెంటనే ఓకే చెప్పారని ఎస్వీ కృష్ణారెడ్డి పేర్కొన్నారు. అయితే నిర్మాత నరసారెడ్డి మాత్రం ఆ కథకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తాను సినిమాను నిర్మించాలంటే టేబుల్ ప్రాఫిట్ ఉండాలని ఆయన చెప్పారని ఎస్వీ కృష్ణారెడ్డి చెప్పుకొచ్చారు. నిర్మాత అలా చెప్పడంతో నేను, నాగ్ బెండ్ అయ్యామని ఆయన తెలిపారు.

కథ మారిందని ఒక మూవీ హక్కులు కొని ఆ సినిమాను వజ్రం పేరుతో రీమేక్ చేశామని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు. నా కెరీర్ లో అతి పెద్ద తప్పు ఇదేనని నాగ్ తో వజ్రం కాకుండా మొదట అనుకున్న కథతో సినిమా తీసి ఉంటే సక్సెస్ దక్కేదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. తాను కృష్ణతో సినిమా తీసి సక్సెస్ సాధించానని ఆయన చెప్పుకొచ్చారు. తాను హీరోగా మారి మరో తప్పు చేశానని ఎస్వీ కృష్ణారెడ్డి అన్నారు.

పూర్తిస్థాయిలో డైరెక్షన్ పై దృష్టి పెట్టి ఉంటే తన కెరీర్ మరో విధంగా ఉండేదని ఆయన చెప్పుకొచ్చారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఆర్గానిక్ మామ హైబ్రీడ్ అల్లుడు సినిమాతో సక్సెస్ సాధిస్తారేమో చూడాలి. ఎస్వీ కృష్ణారెడ్డి కెరీర్ పరంగా మరిన్ని సక్సెస్ లను సాధించి సెకండ్ ఇన్నింగ్స్ ను విజయవంతంగా కొనసాగించాలని అభిమానులు భావిస్తున్నారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus