Jr NTR, Tamanna: ఆ పుకార్లకు చెక్ పెట్టబోతున్న తమన్నా!

  • October 11, 2021 / 01:57 PM IST

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరిస్తున్న ఎవరు మీలో కోటీశ్వరులు షో రేటింగ్స్ వారంవారానికి తగ్గుతున్న సంగతి తెలిసిందే. ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాలనే ఉద్దేశంతో ఈ షో నిర్వాహకులు ఈ మధ్య కాలంలో ఈ షోకు సెలబ్రిటీలను ఎక్కువగా ఆహ్వానిస్తున్నారు. మహేష్ ఈ షోకు హాజరైన ఎపిసోడ్ త్వరలో ప్రసారం కానుండగా సమంత కూడా ఈ షోకు హాజరైన విషయం తెలిసిందే. అయితే ఈ షోకు సెలబ్రిటీ గెస్ట్ గా తమన్నా కూడా హాజరయ్యారని సమాచారం.

యంగ్ టైగర్ ఎన్టీఆర్, తమన్నా కాంబినేషన్ లో ఊసరవెల్లి అనే సినిమా తెరకెక్కి పదేళ్ల క్రితం రిలీజైన సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద ఊసరవెల్లి ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ తర్వాత ఎన్టీఆర్, తమన్నా కలిసి నటించలేదు. మిల్కీ బ్యూటీ ఈ షోలో ఎంత గెలుచుకుంటారో చూడాల్సి ఉంది. జెమినీ ఛానల్ లో తమన్నా మాస్టర్ చెఫ్ అనే షోకు హోస్ట్ గా వ్యవహరించారు. బుల్లితెరపై మాస్టర్ చెఫ్ ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు.

మరోవైపు తమన్నా సైతం వేర్వేరు కారణాల వల్ల ఈ షో నుంచి తప్పుకున్నారు. తమన్నా చేతిలో సినిమాలు ఉన్నా స్టార్ హీరోల సినిమాల్లో తమన్నాకు ఎక్కువగా ఆఫర్లు రావడం లేదు. తమన్నా హాజరైన ఎపిసోడ్ ఎప్పుడు ప్రసారమవుతుందో తెలియాల్సి ఉంది. దసరాకు మహేష్ హాజరైన ఎపిసోడ్ దీపావళికి సమంత హాజరైన ఎపిసోడ్ టెలికాస్ట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయని తెలుస్తోంది. జెమిని ఛానల్ నిర్వాహకులతో తమన్నాకు విభేదాలు ఉన్నాయని వార్తలు వైరల్ అవుతుండగా తమన్నా ఎవరు మీలో కోటీశ్వరులు షోకు హాజరు కావడం ద్వారా ఆ పుకార్లకు కూడా చెక్ పెట్టబోతున్నారు.

కొండ పొలం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

సమంత- నాగచైతన్య మాత్రమే కాదు టాలీవుడ్లో ఇంకా చాలా మంది ఉన్నారు..!
‘రిపబ్లిక్’ మూవీలో గూజ్ బంప్స్ తెప్పించే డైలాగులు ఇవే..!
టాలీవుడ్ స్టార్ హీరోల ఇష్టమైన కార్లు..వాటి ధరలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus