నాగార్జునతో తమన్నా రొమాన్స్ అప్పుడే..!!

  • March 17, 2016 / 01:14 PM IST

నాగార్జున-కార్తీ నటించిన మల్టీస్టారర్ చిత్రం ఊపిరి. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో పీవీపీ సినిమా పతాకం పై తెలుగు,తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన గీతాలను విడుదల చేయగా.. ఈ గీతాలకు మంచి ఆదరణ లభిస్తోంది.

ఈ చిత్రం మార్చి 25 న ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రానుందనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అందుకు ఇటీవల నాగ్, తమన్నాల మధ్య సంభాషణలే కారణం. తనను వీల్ చైర్ లో కూర్చోబెట్టి ..కార్తీ, తమన్నాలు పాటలు పాడటం  తనకి కోపం తెప్పించిందని సరదాగా నాగ్ వ్యాఖ్యానించగా.. ఇప్పుడు కాకపోయిన ఊపిరి 2 లో నాగ్ తో కలిసి డ్యాన్స్ చేస్తానని తమన్నా చెప్పుకొచ్చింది. వీరి వ్యాఖ్యలు కేవలం సరదానేనా లేక సీక్వెల్ ఉందా అన్నది కొద్దిరోజుల్లో తేలిపోతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus