డైరక్టర్ తేజ తనకి నేర్పించిన సంగతులు వెల్లడించిన కాజల్

  • August 4, 2017 / 09:14 AM IST

బాలీవుడ్ బ్యూటీ కాజల్ అగర్వాల్ మంచి చిత్రాలతో తెలుగువారి హృదయాలను గెలుచుకుంది. ఆమె నటించిన తొలి తెలుగు చిత్రం ‘లక్ష్మీకళ్యాణం’. తేజ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సమయంలో కాజల్ బాగా కష్టపడింది. అప్పుడే తెలుగు స్పష్టంగా పలకడం నేర్చుకున్నానని కాజల్ చెప్పింది. ఆమె మళ్ళీ అనేక ఏళ్ళ తర్వాత తేజ దర్శకత్వంలో నటించింది. నేనే రాజు నేనే మంత్రిలో రానాకీ జోడీగా మంచి నటన ప్రదర్శించింది. ఈ మూవీ ఆగస్టు 11 న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్వహించిన ప్రచార కార్యక్రమంలో పాల్గొన్న కాజల్ అనేక విషయాలు వెల్లడించింది. సినిమాని ఎలా ప్రేమించాలో గురువుగారు తేజ ద్వారానే తెలుసుకున్నానని,  ఆయనకు ఓ కవిత రూపంలో కృతజ్ఞత కూడా తెలిపింది.

‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా షూటింగ్‌ టైమ్‌లో తెలుగుని ఇంప్రూవ్ చేసుకున్నట్లు చెప్పింది. ఆమె మాటలను కొంతమంది విమర్శిస్తున్నారు. సాయి పల్లవి, నివేత థామస్ లాంటి వారు ఒక సినిమాతోనే తెలుగును చక్కగా మాట్లాడుతుంటే.. పరిశ్రమకి వచ్చి పదేళ్లు అవుతున్నా కాజల్ ఇంకా తెలుగు నేర్చుకోకపోవడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. అంతేకాదు బాలీవుడ్ భామలు తెలుగు నేర్చుకోవడానికి ఆసక్తి కనబరచరని ఆరోపిస్తున్నారు. మరి ఈ విమర్శలకు కాజల్ ఏమని సమాధానం చెబుతుందో చూడాలి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus