Mahesh Babu, Trivikram: మహేష్ సినిమాపై ఆ వార్తలు నిజం కాదా?

  • August 11, 2021 / 11:42 AM IST

మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాల తర్వాత మరో సినిమా యాక్షన్ బ్యాక్ డ్రాప్ లోతెరకెక్కనుంది. ఖలేజా ఫ్లాప్ కావడంతో మహేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో మరో సినిమా సెట్ కావడానికి చాలా సంవత్సరాల సమయం పట్టింది. ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుండగా థమన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. అయితే మహేష్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా గురించి వైరల్ అయిన కొన్ని గాసిప్స్ విషయంలో నిజం లేదని వెల్లడైంది.

ఈ సినిమాలో త్రిష నటిస్తారని కొన్ని రోజుల క్రితం వార్తలు వచ్చాయి. త్రిషకు గతంతో పోలిస్తే తెలుగు, తమిళ ఇండస్ట్రీలలో ఆఫర్లు తగ్గాయి. తాజాగా మహేష్ త్రివిక్రమ్ మూవీ గురించి వచ్చిన అప్ డేట్ లో త్రిష పేరు లేకపోవడంతో ఈ సినిమాలో త్రిష నటించడం లేదని క్లారిటీ వచ్చింది. ఈ సినిమాకు మొదట పార్థు, అతడే పార్థు అనే టైటిల్స్ వినిపించిన సంగతి తెలిసిందే. మహేష్ త్రివిక్రమ్ మూవీ టైటిల్ కు సంబంధించిన ప్రకటన రాకపోవడంతో ఆ వార్త కూడా నిజం కాదని తేలింది.

వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ఈ సినిమా రిలీజ్ కానుండగా ఈ సినిమా షూటింగ్ ఎప్పటినుంచి మొదలవుతుందో తెలియాల్సి ఉంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ వరుస విజయాలతో జోరుమీదున్న నేపథ్యంలో మహేష్ కు కూడా త్రివిక్రమ్ బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తారని ఫ్యాన్స్ భావిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కనుండగా ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus