మహేష్ సినిమాలో మరో క్రేజీ హీరోయిన్.. సూపర్ కాంబో..!

  • June 27, 2020 / 11:00 AM IST

మ‌హేష్ బాబు తన తరువాతి సినిమాని ‘గీత గోవిందం’ దర్శకుడు ప‌ర‌శురామ్(బుజ్జి డైరెక్షన్లో) చెయ్యబోతున్న సంగతి తెలిసిందే. ‘స‌ర్కారు వారి పాట‌’ అనే టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను కృష్ణ పుట్టినరోజున విడుదల చేశారు. ‘మైత్రి మూవీ మేకర్స్’ ’14 రీల్స్ ప్లస్ ఎంటర్టైన్మెంట్స్’ ‘జి.ఎం.బి ఎంటర్టైన్మెంట్స్’ సంస్థలు కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నాయి. నిజానికి జూలై లోనే ఈ చిత్రం షూటింగ్ ను మొదలుకావాల్సి ఉంది … కానీ వైరస్ మహమ్మారి కారణంగా.. ఆగష్టు లేదా సెప్టెంబ‌రులో రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టాలని దర్శక నిర్మాతలు భావిస్తున్నారు.

ఇదిలా ఉండగా ఈ చిత్రంలో కీర్తి సురేష్ ను హీరోయిన్ గా ఎంపిక చేసుకున్నారు. అయితే ఈ చిత్రం కథ ప్రకారం మరో హీరోయిన్ కు కూడా ఛాన్స్ ఉందట. అందుకే సెకండ్ హీరోయిన్ ప్లేస్ లో క్రేజీ భామను తీసుకున్నారట. ఆమె మరెవరో కాదు నివేదా థామ‌స్ అని సమాచారం‌. కెరీర్ ప్రారంభం నుండీ నివేదా మంచి పాత్రలే చేస్తూ వస్తుంది. ‘జెంటిల్ మెన్’ ‘నిన్ను కోరి’ ‘బ్రోచేవారెవరు రా’ ఇలా ఆమె నటించిన సినిమాలన్నీ హిట్లే.

అయితే పెద్ద సినిమాల్లో మాత్రం ఈమెకు హీరోయిన్ గా ఛాన్స్ లు రాలేదు. ‘జై ల‌వ కుశ‌’ చిత్రంలో ఎన్టీఆర్ తో మాత్రమే నటించింది. ఇక తరువాత రజినీ ‘దర్బార్’ సినిమాలో ఆయన కూతురుగా నటించింది. ఇక పవన్ కళ్యాణ్ ‘వకీల్ సాబ్’ సినిమాలో కూడా నటిస్తుంది… కానీ హీరోయిన్ గా మాత్రం కాదు. అయితే ఈసారి మ‌హేష్ సినిమాలో మాత్రం సెకండ్ హీరోయిన్ గా ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది.

Most Recommended Video

కృష్ణ అండ్ హిజ్ లీల సినిమా రివ్యూ & రేటింగ్
పెంగ్విన్ సినిమా రివ్యూ & రేటింగ్!
టాలీవుడ్ లో అత్యధిక నష్టాలు మిగిల్చిన పది చిత్రాలు ఇవే

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus