సవతులుగా ఆ ఇద్దరు క్రేజీ హీరోయిన్స్..?

  • August 11, 2020 / 02:15 PM IST

ఎంటర్టైన్మెంట్ రంగంలో వచ్చిన విప్లవాత్మక మార్పు డిజిటల్ ప్లాట్ ఫార్మ్స్. రోజు రోజుకు డిజిటల్ ఫార్మట్ మార్కెట్ పెద్దది అవుతుండగా అందరూ ఇటు వైపే చూస్తున్నారు. పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఇదే భవిష్యత్తుగా భావిస్తున్నారు. ఇప్పటికే కొందరు హీరోలు, హీరోయిన్స్ ఓ టి టి బాట పట్టటడం జరిగింది. హీరో అభిషేక్ నటించిన ఓ వెబ్ సిరీస్ ఇప్పటికే విడుదల అయ్యింది. బ్రీత్ అనే టైటిల్ తో తెరకెక్కిన ఈ సిరీస్ ద్వారా హీరోయిన్ నిత్యామీనన్ ఎంట్రీ ఇవ్వడం విశేషం. అలాగే హీరో హృతిక్ రోషన్ రెండు వెబ్ కంటెంట్ సినిమాలు చేయనున్నారట.

ఇక టాలీవుడ్ టాప్ హీరోయిన్ సమంత ఇప్పటికే ది ఫ్యామిలీ మ్యాన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సిరీస్ త్వరలో విడుదల కానుంది. తెలుగు తమిళ చిత్రాల్లో దూసుకుపోతున్న ఇద్దరు హీరోయిన్స్ కలిసి ఓ వెబ్ సిరీస్ చేయనున్నారట. నటుడు శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మీ శరత్ కుమార్ ఇప్పటికే ఓ మూవీలో నటించగా అది ఓ టి టి ప్లాట్ ఫార్మ్ లోకి అందుబాటులోకి వచ్చింది. డానీ పేరుతో ఆమె నటించిన ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ జీ 5లో విడుదల అయ్యింది.

ఇక టాలెంటెడ్ హీరోయిన్ గా పేరున్న ఐశ్వర్య రాజేష్ సైతం ఓ టి టి ఎంట్రీకి సిద్ధం అవుతున్నారట. వరలక్ష్మీ తో కలిసి ఆమె ఓ వెబ్ సిరీస్ చేస్తారట. విశేషం ఏమిటంటే, ఈ సిరీస్ లో వీరిద్దరూ సవతుల వలె నటిస్తారట. ఒకే భర్తను చేసుకున్న భార్యలుగా వీరి పాత్రలు ఉంటాయని సమాచారం. కంటెంట్ కూడా కొంచెం బోల్డ్ గానే ఉంటుందని సమాచారం. మరి చూడాలి ఈ ఇద్దరు భామలు సవతులుగా తెరపై ఏ స్థాయిలో అలరించనున్నారో.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus