ఖైదీ నంబర్ 150 స్పెషల్ ఫిల్మ్ అని చెప్పిన దిల్ రాజు
July 11, 2017 / 11:02 AM IST
|Follow Us
హరీష్ శంకర్ దర్శకత్వంలో అల్లు అర్జున్ నటించిన దువ్వాడ జగన్నాథం సినిమాకి మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ వందకోట్లు కలెక్ట్ చేసి పరుగులు తీస్తోందని ఆ చిత్ర నిర్మాత దిల్ రాజు పోస్టర్స్ రిలీజ్ చేశారు. దీనిపై ఆయన పలు విమర్శలు ఎదుర్కొన్నారు. కథలో సత్తాలేని సినిమా అన్ని కోట్లు ఎలా వసూలు చేసిందని ప్రశ్నించిన వారు లేకపోలేదు. ఇదే కాకుండా ఈ మధ్య కొన్ని సైట్లలో చిరంజీవి ఖైదీ నంబర్ 150 , డీజే ని కంపేర్ చేస్తూ కథనాలు రాశారు. రెండూ ఒకే రేంజ్ చిత్రమని చెబుతున్నారు. దీంతో మెగాస్టార్ ఫ్యాన్స్ కి కోపం వచ్చింది. ఇలా రాయడం వెనుక దిల్ రాజు హస్తం ఉందని, రీసెంట్ గా మెగా అభిమానులు ఆయన ఇంటిని ముట్టడించినట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. అప్పుడు దిల్ రాజు చిరు ఫ్యాన్స్ ని శాంతిప జేయడానికి కొన్ని మాటలు చెప్పారని తెలిసింది.
అవి ఏమిటంటే.. ”నా ఎన్నో సినిమాలకు చిరంజీవిగారు వచ్చారు. ఆయన సినిమాకు ఇచ్చే విలువ ఎంతో గొప్పది. పోతే ఈ మధ్యన సోషల్ మీడియాలో చూస్తున్నాను. ఖైదీ నెంబర్ 150 సినిమాకు, దువ్వాడ జగన్నాథమ్ సినిమాకు ఏవో పోలికలు కావాలనే రాస్తున్నారు. కాని అది చిరంజీవిగారి సినిమా. స్పెషల్ ఫిలిం. ఎప్పుడు ఆయన రేంజ్ పైనే. ఆ సినిమాతో డీజే కి పోలికలు ఏవీ లేవు” అంటూ వివరణ ఇచ్చారు. దాంతో అభిమానులు శాంతించినట్లు సమాచారం.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.