Actress: ముగ్గురి రీ ఎంట్రీ ఫెయిల్ అయ్యింది?

  • June 21, 2023 / 12:09 PM IST

అప్పట్లో ఓ వెలుగు వెలిగిన హీరోయిన్లు ఇప్పుడు రీ ఎంట్రీ ఇవ్వడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే రీ ఎంట్రీ ఇచ్చిన వాళ్లంతా సక్సెస్ అవుతున్నారా? అంటే కచ్చితంగా ఔనని చెప్పలేం. వాళ్ళ రీ ఎంట్రీ గ్రాండ్ గా ఉంటుంది కానీ.. గ్రాండ్ సక్సెస్ అయితే లభించడం లేదు. ఈ మధ్య కాలంలో చూసుకుంటే ముగ్గురు సీనియర్ హీరోయిన్లు రీ ఎంట్రీ ఇవ్వడం జరిగింది. వాళ్ళే వనితా విజయ్ కుమార్, సదా, మీరా జాస్మిన్.

నరేష్,పవిత్ర ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ‘మళ్ళీ పెళ్లి’ చిత్రంతో వనితా విజయ్ కుమార్ రీ ఎంట్రీ ఇచ్చింది. 1999 లో వచ్చిన ‘దేవి’ సినిమాతో ఈమె టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. అందులో ఈమె హీరోయిన్ లాంటి రోల్ ప్లే చేసింది అని చెప్పాలి. 24 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా పెద్ద ప్లాప్ అయ్యింది.

రానా తమ్ముడు అభిరామ్ హీరోగా తేజ దర్శకత్వంలో రూపొందిన ‘అహింస’ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది సదా. 5 ఏళ్ళ తర్వాత రీ ఎంట్రీ ఇవ్వగా .. (Actress) ఈమెకు కూడా సక్సెస్ వరించలేదు.

సముద్ర ఖని ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘విమానం’ సినిమాతో మీరా జాస్మిన్ రీ ఎంట్రీ ఇచ్చింది. 10 ఏళ్ళ తర్వాత మీరా జాస్మిన్ ఈ మూవీతో రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ సక్సెస్ వరించలేదు.

ఆదిపురుష్ సినిమా రివ్యూ & రేటింగ్!

‘సైతాన్’ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
కుటుంబం కోసం జీవితాన్ని త్యాగం చేసిన స్టార్ హీరోయిన్స్

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus