Virata Parvam: రానా ‘విరాట పర్వం’ ఇంత లేట్ అయ్యింది అందుకేనట..!

  • May 27, 2022 / 10:10 PM IST

దగ్గుబాటి రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ‘శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్’ ‘సురేష్ ప్రొడక్షన్స్’ బ్యానర్ల పై సుధాకర్ చెరుకూరి, డి.సురేష్ బాబు లు ఈ చిత్రాన్ని నిర్మించారు.ప్రియమణి, నివేదా పేతురాజ్ వంటి హీరోయిన్లు కూడా ఈ మూవీలో కీలక పాత్ర పోషిస్తున్నారు. ఈశ్వరి రావ్, నవీన్ చంద్ర,సాయి చంద్,నందితా దాస్… వంటి వారు కూడా ముఖ్య పాత్రలు పోషించారు.

నిజానికి ఈ చిత్రం షూటింగ్ ఎప్పుడో కంప్లీట్ అయ్యింది. గతేడాది ‘అరణ్య’ సినిమా విడుదల టైంలోనే టీజర్ ను విడుదల చేశారు. ‘కోలు కోలోయమ్మ’ అనే పాట కూడా హిట్ అయ్యింది. సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. అంతా బానే ఉంది కానీ ఈ మూవీ విడుదల ఎప్పటికప్పుడు వాయిదా పడుతూ వస్తోంది. ‘భీమ్లా నాయక్’ కంటే ముందే ఈ చిత్రం విడుదల కావాల్సింది. ఓ సందర్భంలో ఈ మూవీ ఓటిటిలో విడుదలవుతుంది అని కూడా వార్తలు వచ్చాయి.

సురేష్ బాబు కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేశారు. కానీ చివర్లో విరమించుకున్నారు. ఎట్టకేలకు ఈ చిత్రాన్ని జూలై 1న విడుదల చేస్తానని చిత్ర బృందం ప్రకటించింది. కానీ ఆ డేట్ కు కూడా ఈ మూవీ రిలీజ్ అవుతుందా అంటే అనుమానమే అంటున్నాయి ఫిలింనగర్ వర్గాలు. దీని వెనుక ఓ కారణం కూడా ఉంది. ‘విరాట పర్వం’ చిత్రం నక్సల్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన మూవీ. కాబట్టి ఈ మూవీకి ఆశించిన స్థాయిలో బిజినెస్ జరగడం లేదట.

ఓటిటి డీల్స్ కూడా అంతంత మాత్రంగానే వచ్చినట్టు వినికిడి. ఈ చిత్రం నిర్మాతల్లో ఒకరైన సుధాకర్ చెరుకూరికి ఒక్క హిట్టు కూడా లేదు. వీటి ఎఫెక్ట్ వల్లనే సినిమా డిలే అవుతుందని తెలుస్తుంది.

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus