నెక్స్ట్ సినిమాలో మూడు విభిన్నమైన రోల్స్ పోషించనున్న రవితేజ

  • January 29, 2018 / 12:17 PM IST

మాస్ మహారాజ్ రవితేజ రాజా ది గ్రేట్ అనిపించుకున్న తర్వాత కొత్త దర్శకుడు విక్రమ్ సిరికొండ దర్శకత్వంలో ‘టచ్ చేసి చూడు’ సినిమా చేశారు. లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ పతాకంపై నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ నిర్మించిన ఈ మూవీ ఫిబ్రవరి 2 న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా రిలీజ్ కాకముందే కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో రవితేజ సినిమాని మొదలెట్టిన సంగతి తెలిసిందే. “నేల టికెట్” అనే పేరు పరిశీలిస్తున్న ఈ మూవీ వేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. దీని తర్వాత సినిమాని కూడా ఫిక్స్ చేశారు. శ్రీను వైట్ల దర్శకత్వంలో నటించడానికి ఉత్సాహంగా ఉన్నారు. మైత్రి మూవీ మేకర్స్ వారు నిర్మించనున్న ఈ సినిమా గురించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటికి వచ్చాయి.

ఈ సినిమాలో రవితేజ మూడు విభిన్నమైన పాత్రలో కనిపించబోతున్నట్లు ఫిలిం నగర్ వాసులు చెబుతున్నారు. కథకి తగ్గట్టుగా “అమర్ అక్బర్ ఆంటోనీ” అనే టైటిల్ ను ఖరారు చేసినట్లు తెలిసింది. ఇందులో ఒక పాత్ర ఎన్నారై అని టాక్. అందుకే కొంతభాగం అమెరికాలో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. దూకుడు మూవీ తర్వాత మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్న శ్రీను వైట్ల ఈ సినిమాతో పూర్వ వైభవం సొంతం చేసుకోవాలని స్క్రిప్ట్ పై దృష్టిపెట్టారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus