మానసిక వైద్యుడి దగ్గర చికిత్స పొందుతున్న హీరోయిన్…!

  • April 21, 2020 / 08:02 PM IST

పెళ్ళైన ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకుంది హీరోయిన్ శ్వేతా బసు ప్రసాద్. ‘కొత్త బంగారు లోకం’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ బ్యూటీ .. మొదటి చిత్రంతోనే చెరగని ముద్ర వేసుకుంది. అటు తర్వాత ‘కాస్కో’ ‘కలవర్ కింగ్’ ‘రైడ్’ వంటి చిత్రాలు చేసింది కానీ.. అవన్నీ ఈమెకు పెద్దగా గుర్తింపుని ఇవ్వలేకపోయాయి. తరువాత ఈమెకు ఆఫర్లు కూడా కరువయ్యాయి. అందులోనూ ఈమె ‘సె* రాకెట్’ లో దొరికిపోవడం వంటివి కూడా ఈమెకు ఇక్కడ కెరీర్ లేకుండా చేసాయి అని చెప్పాలి.

తరువాత ఈమె కన్నడ ఇండస్ట్రీకి చెక్కేసి అక్కడ అడపా దడపా సినిమాలు చేసింది. ఇది పక్కన పెడితే 2018 లో ఈమె రోహిత్ మెటల్ అనే డైరెక్టర్ ను వివాహం చేసుకుంది. అయితే పెళ్ళై ఏడాది తిరగకుండానే విడాకులు తీసుకోబోతున్నట్టు ప్రకటించి షాకిచ్చిన సంగతి తెలిసిందే. ఆమెనే స్వయంగా తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని తెలిపింది. అటు తరువాత ఈమె డిప్రెషన్ కు వెళ్లిపోయిందట. ఎవరితోనూ కలవకుండా ఒక గదిలో ఉండిపోయేదట.

దాంతో ఈమెను ఓ మానసిక వైద్యుడు దగ్గర చేర్చారట. ఇప్పటికీ అతని దగ్గర ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్టు.. ఇటీవల ఓ సందర్భంలో చెప్పుకొచ్చింది. లాక్ డౌన్ ఉన్నప్పటికీ ఆన్ లైన్ లో ఆ మానసిక వైద్యుడు సలహాలు ఇస్తాడని తెలిపింది.

Most Recommended Video

తండ్రికి తగ్గ తనయలు అనిపిస్తున్న డైరెక్టర్స్ కూతుళ్లు!
నిర్మాతలుగా కూడా సత్తా చాటుతున్న టాలీవుడ్ హీరోలు!
టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus