కరోనా భారిన పడి ప్రాణాలు కోల్పోయిన ‘శ్రీకారం’ కో డైరెక్టర్ అండ్ ఫ్యామిలీ..!

  • May 5, 2021 / 07:53 PM IST

కరోనా సెకండ్ వేవ్ చాలా ఘోరంగా విజృంభిస్తుంది. గతేడాది కేసులు మాత్రమే అధికంగా నమోదయ్యేవి.! కానీ ఇప్పుడు కేసులతో పాటు మృతుల సంఖ్య కూడా భారీగా పెరుగుతుండడం కలవర పెట్టే విషయం. దీని భారిన పడి ఎంతో మంది ప్రాణాలు కోల్పోతున్నారు. వృద్ధ వయసులో ఉన్నవారే కాదు మిడిల్ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూడా దీని దాటికి కుప్పకూలి పోతున్నారు. టాలీవుడ్లో కూడా ఇప్పటికే చాలా మంది సెలబ్రిటీలు మరణించిన సంగతి తెలిసిందే.

అయితే తాజాగా ఓ కో డైరెక్టర్ మరియు అతని ఫ్యామిలీ మరణించడం.. టాలీవుడ్ లో తీవ్ర అలజడి సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళితే..ఇటీవల శర్వానంద్ హీరోగా ‘శ్రీకారం’ అనే చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే.కిషోర్ అనే యువ దర్శకుడు తెరకెక్కించిన ఈ చిత్రానికి రాజా అనే వ్యక్తి కో రైటర్ గా పనిచేసాడు. ఇటీవల ఇతను కరోనా బారిన పడ్డాడట. ఈ విషయం తెలుసుకుని చికిత్స పొందే లోపే కరోనా ఇతన్ని బలి తీసుకున్నట్లు సమాచారం.

అంతేకాదు ఇతని తల్లిదండ్రులు కూడా ఇదే రోజున మరణించడం విషాదకరం. ఈ విషయం తెలుసుకున్న తరువాత టాలీవుడ్ లో విషాద ఛాయలు ఏర్పడ్డాయి. రాజాకు మరియు అతని కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నారు కొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలు. అంతేకాకుండా టాలీవుడ్లో ఇంకా చాలా మంది కరోనా భారిన పడి చాలా ఇబ్బందులు పడుతున్నట్టు వినికిడి.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus