అనసూయ ఆ కట్టు, బొట్టు ఆమెను చూసే నేర్చుకొందట.!

  • April 11, 2018 / 09:41 AM IST

‘రంగస్థలం’ సినిమాలో రామ్ చరణ్, ఆది పినిశెట్టిల తర్వాత ఆ స్థాయిలో నటిగా పేరు తెచ్చుకొంది అనసూయ. ఆమె పోషించిన “రంగమ్మత్త” పాత్రకు ఎనలేని పేరు వచ్చింది. అనసూయ మాత్రమే కాదు సుకుమార్ కూడా ఆ క్యారెక్టర్ కి అంత మంచి పేరు వస్తుందని ఊహించనేలేదు. అయితే.. రంగమ్మత్తగా తాను అంత అద్భుతంగా నటించడానికి కారణం మాత్రం తన పనిమనిషి అని చెబుతోంది అనసూయ. తన ఇంట్లో రాయలసీమకు చెందిన ఓ మహిళా పనిమనిషిగా వర్క్ చేస్తోందని.. “రంగస్థలం” కథ విన్న తర్వాత ఆమెను బాగా అబ్జర్వ్ చేయడం మొదలెట్టానని, యాస మినహా మేనరిజమ్స్, సిట్టింగ్, వర్కింగ్ స్టైల్ ఆమెను చూసి నేర్చుకొన్నానని చెప్పింది అనసూయ.

ఈ విషయం ఆ పనిమనిషికి తెలిస్తే ఎంత మురిసిపోతుందో కదూ. ఇకపోతే.. తాజా సమాచారం ప్రకారం వెంకటేష్-వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతున్న మల్టీస్టారర్ లోనూ మంచి పాత్ర దక్కించుకొందట అనసూయ. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న “ఎఫ్ 2″లో అనసూయ రోల్ ఏంటి అనేది ఇంకా తెలియనప్పటికీ.. హీరోయిన్ గా నటించనున్న మెహరీన్ కంటే అనసూయది పెద్ద రోల్ అట. చూస్తుంటే.. అనసూయ త్వరలోనే మోస్ట్ వాంటెడ్ ఆర్టిస్ట్ అయిపోయేలా ఉంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus