కె.వి.రెడ్డిగా క్రిష్, సింగీతం పాత్రలో తరుణ్ భాస్కర్!

  • October 21, 2017 / 11:07 AM IST

వైజయంతీ మూవీస్-స్వప్న సినిమా పతాకంపై అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న “మహానటి” సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం కావడంతో ఆమె కెరీర్ లో అత్యంత కీలకమైన “మాయాబజార్” సినిమా సెట్ ను రీక్రియేట్ చేశారు. ప్రస్తుతం “మాయాబజార్” సెట్ లోనే షూటింగ్ జరుగుతోంది. కీర్తి సురేష్, మోహన్ బాబు, దర్శకుడు క్రిష్, దర్శకుడు తరుణ్ భాస్కర్ లు పాల్గొన్న చిత్రీకరణా స్థలానికి సీనియర్ దర్శకులు సింగీతం శ్రీనివాసరావుగారు విచ్చేయడం విశేషం.

“మాయాబజార్”కు కె.వి.రెడ్డి దర్శకులు కాగా.. అప్పట్లో సింగీతం శ్రీనివాసరావు ఆయనకు అసిస్టెంట్ డైరెక్టర్ గా వ్యవహరించారు. ఇప్పుడు “మహానటి”లో కె.వి.రెడ్డి పాత్రను ప్రముఖ దర్శకులు క్రిష్ పోషిస్తుండగా.. సింగీతం శ్రీనివాసరావు పాత్రలో “పెళ్ళిచూపులు” దర్శకుడు తరుణ్ భాస్కర్ కనిపించనున్నాడు. ఇకపోతే.. ఎస్వీ రంగారావు పాత్రలో విలక్షణ నటుడు మోహన్ బాబు నటించనున్న విషయం తెలిసిందే. తోట తరణి పర్యవేక్షణలో అవినాష్ వేసిన “మాయాబజార్” సెట్ లో ప్రస్తుతం షూటింగ్ జరుగుతోంది. ఈ షూటింగ్ స్పాట్ కు నేడు సింగీతం శ్రీనివాసరావుగారు విచ్చేశారు. తాను కె.వి.రెడ్డి గారి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసినప్పటి మధుర క్షణాలు, “మాయాబజార్” చిత్రానికి పనిచేసిన మధురానుభూతులను నెమరువేసుకొన్నారు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus