కొత్త విషయాన్ని తెలియజేసిన త్రిష..!

  • October 16, 2020 / 12:30 PM IST

తెలుగులో సూపర్ హిట్ అయిన ‘ఒక్కడు’ చిత్రం ఇప్పటికీ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంది. ఈ చిత్రంలో చాలా హైలెట్ సీన్స్ ఉన్నాయి కానీ.. యూత్ ను బాగా ఆకట్టుకునేది ఎయిర్పోర్ట్ సీన్ అనే చెప్పాలి. ‘చూడాలని ఉంది’ లో ట్రైన్ సీన్ ఎంత ఫేమస్ అయ్యిందో .. ‘ఒక్కడు’ లో ఎయిర్పోర్ట్ సీన్ కూడా అంతే ఫేమస్ అయ్యింది. అయితే ‘ఒక్కడు’ సినిమాలోనూ ’96’ (తమిళ్) మూవీ లోనూ సేమ్ సీన్ ఎక్కడ ఉంది కన్ఫ్యూజ్ అవుతున్నారా? అదేమీ లేదండి.. మన ‘ఒక్కడు’ చిత్రాన్ని తమిళ్ లో ‘గిల్లి’ పేరుతో రీమేక్ చేసిన సంగతి తెలిసిందే.

ఆ చిత్రంలో క్లైమాక్స్ సీన్ అలాగే ’96’ లో క్లైమాక్స్ సీన్.. రెండూ ఒకేలా ఉంటాయట. ఈ విషయాన్ని తెలియజేసింది మరెవరో కాదు మన త్రిష. తాజాగా తన సోషల్ మీడియాలో ఒక వీడియోని పోస్ట్ చేసింది త్రిష. ఈ వీడియోలో ‘గిల్లి’ మరియు ’96’ సినిమాల్లో క్లైమాక్స్ సీన్లు చాలా వరకూ ఒకేలా ఉన్నాయి.ఈ రెండు సినిమాల్లోనూ హీరోయిన్ త్రిషనే కావడం మరో విశేషం.ఇక ఈ రెండు సినిమాల క్లైమాక్స్ లో…. హీరోయిన్ ను ఎయిర్పోర్ట్ లో దిగబెట్టి హీరోలు వెళ్ళిపోతారు.

ఆ తరువాత హీరోయిన్ ను తలుచుకుని బాధపడుతుంటారు. అందుకే త్రిష వీటికి.. ‘2 ఇన్ 1’ అంటూ కామెంట్ పెట్టింది. అయితే ‘గిల్లి’ క్లైమాక్స్ కు మన ‘ఒక్కడు’ క్లైమాక్స్ కు చాలా తేడా ఉంటుంది. మన ‘ఒక్కడు’ లో హీరోయిన్ ఫ్లైట్ ఎక్కదు.. కానీ ‘గిల్లి’ లో ఫ్లైట్ ఎక్కి బాధపడుతున్నట్టు చూపిస్తారు. త్రిష ఈ ట్వీట్ పెట్టడంతో ఈ సినిమాల గురించి మళ్ళీ డిస్కస్ చేసుకుంటున్నారు మన నెటిజన్లు. ఇక ’96’ చిత్రం కూడా తెలుగులో ‘జాను’ గా రీమేక్ అయిన సంగతి తెలిసిందే.


Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus