ఈసారి మాటల మాంత్రికుడు.. ఏం మాయ చేస్తాడో చూడాలి..!

  • July 18, 2019 / 06:32 PM IST

మాటల మాంత్రికడు త్రివిక్ర‌మ్ గురించి ప్రత్యేకంగా ఇంట్రొడక్షన్ ఏమీ ఇవ్వనక్కర్లేదు. ఎందుకంటే కేవలం పెన్ పవర్ తోనే ఓ రేంజ్ స్టార్ స్టేటస్ ను అందుకున్న దర్శకుడాయన. కెరీర్ ప్రారంభంలో రచయితగా పనిచేస్తూ వచ్చి తరుణ్ తో ఓ ప్రేమ కథను తెరకెక్కించి హిట్టందుకున్నాడు. మహేష్ తో ‘అతడు’ చేసి ఫ్యామిలీ ఆడియన్స్ ను లాక్ చేసాడు. ఇక పవన్ తో ‘జల్సా’ చేయించి స్టార్ స్టేటస్ ను అందుకున్నాడు. అయితే త్రివిక్రమ్ తో ఏ హీరో పనిచేసినా.. మళ్ళీ మళ్ళీ ఆయనతోనే పని చేయాలని ఆసక్తి చూపుతుంటారు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, అల్లు అర్జున్ ఈ లిస్ట్ లో ముందు వరుసల వున్నారు. ఇప్పుడు ఎన్టీఆర్ కూడా మరోసారి త్రివిక్రమ్ డైరెక్షన్లో చేయాలని తెగ ఆసక్తి చూపిస్తున్నాడట.

ఇదిలా అండగా.. ఇప్పటికే పవన్ కళ్యాణ్ తో మూడు సినిమాలు చేసాడు త్రివిక్రమ్. వీరి కాంబినేషన్లో మూడో చిత్రంగా వచ్చిన ‘అజ్ఞాతవాసి’ చిత్రం 2018 సంక్రాంతి కానుకగా విడుదలయ్యి డిజాస్టర్ గా మిగిలింది. ఇప్పుడు అల్లు అర్జున్ తో కూడా మూడో చిత్రం చేస్తున్నాడు త్రివిక్రమ్.. ఈ చిత్రం కూడా 2020 సంక్రాంతికే విడుదల కానుంది. ఇదే సీజన్లో ఓ ఘోరమైన డిజాస్టర్ అందుకున్న త్రివిక్రమ్.. ఈ సారి హిట్టుకొట్టి ఆ సెంటిమెంట్ ను బ్రేక్ చేస్తాడో లేదో చూడాలి మరి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus