అమీషా పటేల్ ని విమర్శిస్తున్న అభిమానులు

  • August 24, 2018 / 09:28 AM IST

“కహో నా ప్యార్ హాయ్” అనే సినిమాతో అమీషా పటేల్ బాలీవుడ్ లో కెరీర్ ప్రారంభించింది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బద్రి సినిమాతో తెలుగులో ప్రవేశించింది. 2000 లో రిలీజ్ అయిన ఈ రెండు సినిమాలు సూపర్ హిట్ అయి రెండు పరిశ్రమల్లో భారీ అవకాశాలను తెచ్చి పెట్టాయి. ఆ తర్వాత ఆమె సూపర్ స్టార్ మహేష్ బాబు నాని చిత్రంలో నటించింది. అనంతరం యంగ్ టైగర్ ఎన్టీఆర్ నరసింహుడు చిత్రంలో ఆడి పాడింది. కొత్త భామలతో పోటీ పడలేక కొంతకాలంగా పరిశ్రమకి దూరంగా ఉన్న ఈ బ్యూటీ రీసెంట్ గా ఆకతాయి సినిమాలో అందాలు ఆరబోసింది. స్పెషల్ సాంగ్ లో అదరగొట్టింది. అలాగే హిందీలోనూ గ్లామరస్ పాత్రలను చేస్తోంది. నలభైలోను ఆమె ఎంచుకున్న రోల్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు.

అంతేకాదు ఇన్స్ టాగ్రామ్ అకౌంట్ లోను తన ఎక్స్ పోజింగ్ ఫోటోలను పెట్టి మతిపోగొడుతోంది. కొంతమంది ఆమె ఫోటోలను చూసి ఆనందిస్తుంటే.. మరికొంత మంది మాత్రం విమర్శలు గుప్పిస్తున్నారు. “వయసు చూసుకో ఆంటీ..” అని… “ఇప్పుడివి అవసరమా” అని కామెంట్స్ చేస్తున్నారు. రీసెంట్ గా బాడీ షిమ్మర్ ని ఒళ్ళంతా రాసుకుని క్లీవేజ్ ని ఎక్స్ పోజ్ చేస్తూ ఇచ్చిన స్టిల్ .. ఈ నెగటివ్ కామెంట్స్ కి కారణమయింది. ఈ కామెంట్స్ ని అమీషా పెద్దగా పట్టించుకోవడం లేదని సన్నిహితులు చెప్పారు. ఈ వయసులోనూ ఆమె సినిమాలో గ్లామర్ రోల్స్ చేయడానికి ఆసక్తి కనరుస్తోందని వెల్లడించారు. మరి అమీషా కోరుకున్నట్టు అవకాశాలు వస్తాయేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus