అఖిల్, శ్రీయ నిశితార్ధ వేడుకలో ఉపాసన ఏమి చేసిందో తెలుసా ?

  • December 13, 2016 / 10:37 AM IST

మెగా స్టార్ చిరంజీవి కోడలు, రామ్ చరణ్ తేజ్ భార్య ఉపాసన చాలా హుందాగా ఉంటారు. మీడియాకు చాలా దూరంగా ఉండే ఈమె కొంతకాలం క్రితం ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇచ్చి తనపై వస్తున్న  విమర్శలకు గట్టిగానే సమాధానమిచ్చారు. తాజాగా ఆమె గురించి ఓ వార్త బయటికి వచ్చింది. గత శుక్రవారం హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు అతిథిగృహంలో జరిగిన అఖిల్‌, శ్రీయా భూపాల్‌ నిశ్చితార్థ వేడుకలో ఉపాసన హంగామా చేసినట్లు తెలిసింది. అతి తక్కువ సంఖ్యలో సినీ, వ్యాపార, రాజకీయ ప్రముఖులు హాజరైన ఈ వేడుకలో నాగచైతన్య , సమంత లు జంటగా వచ్చి స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలవగా, ఉపాసన తన ప్రవర్తనతో అందరి కళ్ళు తనవైపు తిప్పుకున్నారు.

మెగాస్టార్ 150 వ సినిమా షూటింగ్ లోను, రామ్ చరణ్ ధృవ ప్రమోషన్ లో బిజీగా ఉండగా ఆ కుటుంబం తరుపున హాజరైన ఆమె.. స్నేహితులతో కలిసి కొత్త జంటను ఆటపట్టించిందంట. ఇదివరకే పరిచయం ఉండడంతో ఉపాసన టీజింగ్ ని  శ్రీయ భూపాల్ ఎంజాయ్ చేసిందని సమాచారం. పబ్లిక్ కార్యక్రమాల్లో ఎప్పుడూ నోరు కూడా మెదపని మెగా కోడలు టీజ్ చేయడం చూసిన అతిథులు ఆశ్చర్యపోయారంట. ఈ విషయం తెలుసుకున్న ప్రతి ఒక్కరిది అదే ఫీలింగ్.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus