రాఘవేంద్రరావు సినిమాకి కమర్షియల్ హంగులు!

  • November 28, 2020 / 03:57 PM IST

వంద సినిమాలకు పైగా దర్శకుడిగా పని చేసిన దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు ‘ఓం నమో వెంకటేశాయ’ సినిమా తరువాత మెగాఫోన్ పట్టలేదు. ‘పెళ్లి సందడి’ సినిమాకి సీక్వెల్ తీస్తున్నా.. అది కేవలం దర్శకత్వ పర్యవేక్షణ మాత్రమే. ఇదిలా ఉండగా.. తాజాగా ఆయన కెమెరా ముందుకు రావడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నారు. త‌నికెళ్ల భ‌ర‌ణి ద‌ర్శ‌క‌త్వంలో రాఘ‌వేంద్ర‌రావు ప్ర‌ధాన పాత్ర‌లో ఓ సినిమా తెర‌కెక్కుతోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టికే కథా చ‌ర్చ‌లు పూర్త‌య్యాయ‌ని, ఈ సినిమాలో న‌టించ‌డానికి రాఘ‌వేంద్ర‌రావు అంగీకరించారని తెలుస్తోంది.

సినిమాలో ప్రధాన పాత్ర అయినప్పటికీ ఆయన వయసుకి తగ్గట్లు పాత్ర హుందాగా ఉండబోతుందని తెలుస్తోంది. కథ ప్రకారం ఈ సినిమాలో ముగ్గురు హీరోయిన్లు కనిపించనున్నారట. ఆ పాత్రల్లో సమంత, శ్రియ, రమ్యకృష్ణలను తీసుకోబోతున్నట్లు సమాచారం. నిజానికి తణికెళ్లభరణి ఓ ప్రయోగాత్మక కథని రాసుకున్నారట. దానికి కమర్షియల్ హంగులు కూడా జోడించాలని భావించడంతో ఈ ముగ్గురు హీరోయిన్లకు చోటు కల్పించబోతున్నారని తెలుస్తోంది. సమంత, శ్రియలు అతిథి తరహా పాత్రల్లో కనిపించబోతున్నట్లు..

రమ్యకృష్ణ పాత్ర మాత్రం పూర్తి నిడివితో సాగబోతుందని టాక్. వచ్చే ఏడాదిలో సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నారు. ఓ నవల ఆధారంగా ఈ సినిమా తెరకెక్కనుందని చెబుతున్నారు.

Most Recommended Video

బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీస్ ను రిజెక్ట్ చేసిన రాజశేఖర్..!
టాలీవుడ్లో సొంత జెట్ విమానాలు కలిగిన హీరోలు వీళ్ళే..!
ఈ 25 మంది హీరోయిన్లు తెలుగు వాళ్ళే .. వీరి సొంత ఊర్లేంటో తెలుసా?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus