Vaishnavi: స్టేజి పైనే కన్నీళ్లు పెట్టుకున్న వైష్ణవి.. ఏమైందంటే?

  • July 13, 2023 / 02:48 PM IST

విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన ‘బేబీ’ చిత్రం జూలై 14 న ప్రేక్షకుల ముందుకు రానుంది. సాయి రాజేష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ‘మాస్ మూవీ మేకర్స్’ బ్యానర్ పై ఎస్.కె.ఎన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. విరాజ్ అశ్విన్ మరో హీరోగా నటిస్తుండగా వైష్ణవి హీరోయిన్ గా నటిస్తుంది. ప్రమోషన్లలో భాగంగా విడుదల చేసిన పాటలు, టీజర్, ట్రైలర్ వంటివి ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకున్నాయి.

యూత్ లో ఈ చిత్రం పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇక నిన్న జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా హీరోయిన్ వైష్ణవి (Vaishnavi) మాట్లాడుతూ .. కన్నీళ్లు పెట్టుకుంది. ఆమె చేసిన ఎమోషనల్ కామెంట్స్ కూడా వైరల్ అవుతున్నాయి. వైష్ణవి మాట్లాడుతూ… ‘‘సొసైటీలో చోటుచేసుకున్న కొన్ని యదార్ధ సంఘటనలను ఆధారంగా చేసుకుని ‘బేబీ’ రూపొందింది. ప్రతిఒక్కరూ సినిమా చూస్తున్నప్పుడు కథలో ఇన్వాల్వ్ అయ్యి చూస్తారు.

అందులో డౌట్ లేదు యూట్యూబ్ వీడియోలు చేసుకుంటూ ఉండే నాకు ఈ ‘బేబీ’ కథ రావడం నా అదృష్టంగా భావిస్తున్నాను. దర్శకుడు రాజేశ్ నన్ను నాకన్నా ఎక్కువ నమ్మి ముందుకు నడిపించారు. ‘ఈ అమ్మాయి యూట్యూబర్, క్యారెక్టర్ ఆర్టిస్ట్. సినిమాలో లీడ్‌గా చేయలేదు’ అనే కామెంట్లు వినిపించినప్పుడు… నాకు చాలా భయమేసేది. ఆ టైంలో అన్ని విషయాలు వివరించి, రాజేష్ ధైర్యాన్ని ఇచ్చారు. ఆయన వల్లే నేనో కొత్త ప్రపంచాన్ని చూశాను’’ అంటూ కన్నీళ్లు పెట్టుకుంది.

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus