ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌ సంచలనమైన కామెంట్

  • October 25, 2016 / 12:07 PM IST

యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి తెలుగు దేశం పార్టీతోనూ, ఆ పార్టీ నేతలతో మొదటి నుంచి మంచి సంబంధాలు ఉన్నాయి. ఆ స్నేహంతో గతంలో టీడీపీ లీడర్లు తారక్ తో సినిమాలు తీశారు.  కృష్ణా జిల్లా గ‌న్న‌వ‌రం టీడీపీ ఎమ్మెల్యే వ‌ల్ల‌భ‌నేని వంశీమోహ‌న్‌, మరో నేత కొడాలి నానితో క‌లిసి ఎన్టీఆర్ హీరోగా అదుర్స్ సినిమాను నిర్మించారు. అయితే కొంతకాలంగా ఎన్టీఆర్ ని పార్టీ నుంచి దూరం పెట్టే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు తనయుడు లోకేష్ రంగంలోకి వచ్చినప్పటినుంచి ఎన్టీఆర్ ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు.

తాజాగా ఎమ్మెల్యే వంశీమోహ‌న్‌ ఓ ఇంటర్వ్యూ లో చెప్పిన మాటలను బట్టి చూస్తుంటే ఎన్టీఆర్ పై చిన్నచూపు నిజమనిపిస్తోంది.  ఓ ప్ర‌ముఖ ఛానెల్ యాంక‌ర్ వంశీని మీరు లోకేష్‌బాబుకు ప్ర‌యారిటీ ఇస్తారా ? ఎన్టీఆర్‌కు ప్ర‌యారిటీ ఇస్తారా ? అని అడిగితే.. అందుకు వంశీ స్పందిస్తూ లోకేష్ బాబుకే ప్ర‌యారిటీ అని స్పష్టం చేశారు. స్నేహం, రాజకీయం వేరని ఆయన చెప్పకనే చెప్పాడు. రాజకీయాలకు దూరంగా, పూర్తిగా సినిమాలపై దృష్టి పెట్టిన ఎన్టీఆర్ దీనిపై ఏవిధంగా స్పందిస్తారో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus