‘వాల్మీకి’ ప్రీ టీజర్ ఎలా ఉండబోతుందంటే?

  • June 22, 2019 / 07:02 PM IST

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, హరీష్ శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ‘వాల్మీకి’. ’14 రీల్స్ ప్లస్’ బ్యానర్ పై రూపొందుతున్న ఈ చిత్రంలో పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో వరుణ్, పూజా హెగ్దే కాంబినేషన్లో ‘ముకుంద’ చిత్రం వచ్చిన సంగతి తెలిసిందే. సుమారు 5 ఏళ్ళ తరువాత వీరిద్దరి కాంబినేషన్లో ఈ చిత్రం వస్తుంది. ఈ చిత్రంలో వరుణ్ పక్కా మాస్ క్యారెక్టర్లో.. అందులోనూ నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ చిత్రం ‘జిగర్తాండా’ రీమేక్ కావడంతో అందులో బాబీ సింహ పోషించిన పాత్రనే వరుణ్ పోషిస్తున్నాడు.

ఇక ‘వాల్మీకి’ ప్రీటీజర్ ను జూన్ 24 న సాయంత్రం 5:18 గంటలకు విడుదల చేయబోతున్నారు. హరీష్ శంకర్ తన ట్విట్టర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపాడు. ఈ టీజర్ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే ఇది ప్రీటీజర్ మాత్రమే కాబట్టి ఎటువంటి డైలాగ్స్ ఉండవట. కేవలం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో పాత్రలని చూపిస్తారట. మిక్కీ.జె.మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 6న విడుదల చేయబోతున్నట్టు చిత్ర యూనిట్ తెలిపింది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus