రెండు వారాల పాటు ప్రత్యేక శిక్షణ తీసుకోనున్న వరుణ్ తేజ్ బృందం.!

  • April 13, 2018 / 06:29 AM IST

ఘాజి సినిమాతో ఇండస్ట్రీ దృష్టిని ఆకర్షించిన యువ దర్శకుడు సంకల్ప్ రెడ్డి దర్శకత్వంలో వరుణ్ తేజ్ నటించనున్న సంగతి తెలిసిందే. అంతరిక్షం నేపథ్యంలో జరిగే ఈ స్టోరీకి  ప్రీ ప్రొడక్షన్ వర్క్ వేగంగా సాగుతోంది. ఇందులో వ్యోమగామి (రోదసి యాత్రికుడు) గా వరుణ్ తేజ్ కనిపించనున్నారు. జీరోగ్రావిటీలో తేలియాడేట్టుగా నటించేందుకు అతను ప్రతేకంగా ఖజకిస్థాన్ లో శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో నటించనున్న ఇతరనటీనటులకు కూడా శిక్షణ ఇవ్వనున్నారు. అందుకోసం బల్గెరియా నుంచి యాక్షన్ కొరియోగ్రాఫర్లు హైదరాబాద్ కి రానున్నారు.

అన్నపూర్ణ స్టూడియోలో వేసిన సెట్ లో చిత్ర బృందానికి రెండు వారాలపాటు స్పెషల్ వర్క్ షాప్ నిర్వహించనున్నారు. ఇందులో వరుణ్ తేజ్ తో పాటు హీరోయిన్స్  బాలీవుడ్ బ్యూటీ అదితిరావు హైద‌రీ, లావణ్య త్రిపాఠి.. ఇతర నటీనటులు పాల్గొననున్నారు. ఏప్రిల్ చివరి వారంలో ఈ మూవీ సెట్స్ మీదకు వెళ్లనుంది. ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్ టైన్మెంట్స్ సంస్థ బ్యానర్లో తెరకెక్కనున్న ఈ చిత్రానికి అహంబ్రహ్మాస్మి అనే టైటిల్ పరిశీలిస్తున్నారు. బిబో శ్రీనివాస్ సమర్పణలో జాగర్లమూడి సాయిబాబా-రాజీవ్ రెడ్డి నిర్మించనున్న ఈ సినిమా కమర్షియల్ సినిమాలకు విభిన్నంగా ఉండనుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus