మరో…ముల్టీ స్టారర్…వెంకీతో రవితేజ!!!

  • October 8, 2016 / 11:28 AM IST

టాలీవుడ్ టాప్ హీరోల్లో ముల్టీ స్టారర్ సినిమాలను ప్రోత్సహిస్తూ ఇండస్ట్రీకి ముల్టీ స్టారర్ ఫ్లేవర్ ను మరింత యాడ్ చేసే విధంగా మన విక్టరీ వెంకటేష్ భారీగా ఆలోచనలు చేస్తున్నాడు…అయితే ప్రిన్స్ మహేష్ తో, అటుపై రామ్ తో ఇలా సినిమాలు చేసుకుంటూ వస్తున్న మన వెంకీ…తాజాగా బాబు బంగారంతో మళ్లీ సోలో హిట్ అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఆ మధ్య వెంకీ…రవితేజతో సక్సెస్ఫుల్ డైరెక్టర్ “వీరు పోట్లా” ఒక ముల్టీ స్టారర్ సినిమాను ప్లాన్ చేసినట్లు సమాచారం. అయితే ఆ వార్త అలానే చీకట్లో కలసి పోవడంతో అందులో నిజం ఎంత ఉందో తెలీదు.

అంతేకాదు ఆ తరువాత ఆ దర్శకుడు కూడా మాయం అయిపోవడంతో అతని చాప్టర్ అయిపోయిందేమో అనుకున్నారు అంతా…కానీ మళ్ళీ…సునీల్ హీరోగా “వీడు గోల్డ్ ఎహె” అనే సినిమా తీసిన వీరు పోట్లా….ఒకానొక టీవీ ఛానెల్ కు ఇచ్చిన ఇంటెర్వ్యులో మాట్లాడుతూ….ఆ ముల్టీ స్టారర్ స్టారర్ గురించి గుట్టు విప్పాడు….14 రీల్స్ ఎంటర్ టైన్మెంట్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తాను అంటే….అప్పట్లో తాను ఈ ప్రాజెక్టు కోసం స్క్రిప్టు రెడీ చేశాని అని…‘‘వెంకటేష్.. రవితేజ” కాంబినేషన్లో భారీ మల్టీస్టారర్ కే ప్లాన్ చేశామని….చెబుతూ….కానీ చివరి నిమిషంలో ఈ ప్రాజెక్ట్ ఆగిపోయింది. ఆ తర్వాత మరో హీరోతో ఓ ప్రాజెక్ట్ అనుకున్నాను. అది కూడా రకరకాల కారణాల వల్ల ఆగిపోయింది. అందువల్లే నా కెరీర్లో గ్యాప్ వచ్చింది అని తెలిపాడు వీరు….ఇక సినిమా ఆగిపోవడానికి కారణం అడగగా…సినిమాలు ఆగిపోవడానికి కారణాలేంటో చెప్పలేను. ఎవరి లెక్కలు వారికి ఉంటాయి. వాళ్లు నాకు అవకాశం ఇవ్వలేదు అనుకోవడం కంటే నా టైం బాగోలేదు అనుకున్నాను. అలాగే నేనే మంచి స్ర్కిప్ట్ తీసుకెళ్లలేదేమో అని కూడా ఆలోచించాను అంటూ తెలిపాడు…అదీ విషయం.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus