బాలయ్య తరువాత వెంకీతో చేస్తా!!!

  • March 20, 2017 / 06:43 AM IST

టాలీవుడ్ లో టాప్ హీరోల్లో బాలయ్య, చిరు, వెంకీ నాగ్ వీళ్ళు ఇండస్ట్రీని శాసించిన రోజులు ఇప్పటికీ మరచిపోలెం….అయితే అదే క్రమంలో పాలిటిక్స్ బాట పట్టిన చిరు…సినిమాల విషయంలో కాస్త వెనుకబడగా…..వెంకీ సైతం ఇతరత్రా కారణాల వల్ల వెనుకబడి మళ్లీ పుంజుకునే ప్రయత్నాలు చేస్తున్నాడు…..వెంకీ…ప్రస్తుతం గురు సినిమా చేస్తున్నాడు. వచ్చే నెలలో ఈ సినిమా రిలీజ్ కి సిద్దం అవుతుంది….ఈ సినిమా వెంకీ ఒక పాట సైతం పాడాడు….అంతేకాకుండా…ఈ సినిమాలో మిడిల్ ఎజేడ్ క్యారక్టర్ చేస్తున్నాడు విక్టరీ వెంకటేష్. అయితే బాబు బంగారంతో ఫ్యాన్స్ ను ఖుషి చేసిన వెంకటేష్ గురుతో కూడా హిట్ కొట్టేస్తాడని అందరూ అనుకుంటున్నారు…. అయితే ఈ సినిమా తరువాత వెంకీ ఏ సినిమా చెయ్యబోతున్నాడు…ఎవరితో సినిమా తియ్యనున్నాడు అన్న న్యూస్ మాత్రం ఇప్పటికీ ఎవ్వరికీ తెలియడం లేదు….అసలైతే వెంకటేష్ కిశోర్ తిరుమలతో ఆడాళ్లు మీకు జోహార్లు సినిమా చేయాల్సి ఉంది.

అయితే ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాలు తీసి తన ఫ్యాన్స్ కు దూరమైన వెంకటేష్ మళ్లీ అలాంటి తప్పు జరుగకూడదనే ఉద్దేశంతో కిశోర్ సినిమా కాదనేశాడట. ఇక క్రిష్ సినిమా అనుకున్నా అది ఎందుకో పట్టాలెక్కలేదు. ఫైనల్ గా పూరి డైరక్షన్ లో ఓ దేశభక్తి సినిమా చేయాలని చూశాడు వెంకటేష్. కథ అంతా నచ్చినా బడ్జెట్ ప్రాబ్లెం వల్ల ఆ సినిమా అటకెక్కిందని అన్నారు. అయితే అసలు విషయం ఏంటంటే పూరితో సినిమా ఇంకా చర్చల దశల్లోనే ఉందట. ప్రస్తుతం బాలయ్యతో సినిమా చేస్తున్న పూరి సెప్టెంబర్ కల్లా దాన్ని పూర్తి చేయాలని చూస్తున్నాడు. అది పూర్తి కాగానే వెంకటేష్ తో సినిమా చేస్తాడట పూరి జగన్నాధ్. హిట్స్ విషయంలో కాస్త వెనుకబడ్డ పూరీ ఇప్పుడు బాలయ్య తో ఒక సినిమా చేస్తూ ఉండగా…ఆ తరువాత వెంకీ తో సినిమా పట్టాలు ఎక్కనుండడం చూస్తూ ఉంటే…పూరీ మళ్లీ హిట్ ట్ర్యాక్ లోకి వస్తున్నట్లే ఉన్నాడు….


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus