Vijayashanti, Gopichand: ఆ రీజన్ వల్లే లేడీ అమితాబ్ ఒప్పుకున్నారా?

  • August 31, 2021 / 12:11 PM IST

లేడీ అమితాబ్ విజయశాంతి ఈ మధ్య కాలంలో ఎక్కువ సంఖ్యలో సినిమాల్లో నటించడం లేదనే సంగతి తెలిసిందే. సరిలేరు నీకెవ్వరు సినిమాతో రీఎంట్రీ ఇచ్చిన విజయశాంతి తాజాగా మరో ప్రాజెక్ట్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. లక్ష్యం, లౌక్యం సినిమాల తర్వాత గోపీచంద్, శ్రీవాస్ కాంబినేషన్ లో మరో సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. త్వరలోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్లనుండగా కథ,

పాత్ర నచ్చడంతో విజయశాంతి ఈ సినిమాలో నటించడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని తెలుస్తోంది. త్వరలో విజయశాంతి ఈ సినిమాలో నటిస్తున్నట్టు అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయి. గోపీచంద్ తండ్రి టి కృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన కొన్ని సినిమాల్లో విజయశాంతి నటించారు. ఆ సినిమాలు విజయశాంతికి నటిగా మంచి పేరును తెచ్చిపెట్టాయి. దర్శకుడు టి కృష్ణపై ఉన్న గౌరవం వల్లే విజయశాంతి ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది.

మరోవైపు ఈ సినిమాలో రాజశేఖర్ కీలక పాత్రలో నటిస్తున్నట్టు వార్తలు వచ్చాయి. దర్శకుడు శ్రీవాస్ తన తరువాత సినిమా సెట్స్ పై వెళ్లకుండానే సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగేలా చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో సరైన సక్సెస్ లేని గోపీచంద్ భవిష్యత్తు ప్రాజెక్ట్ ల విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోపీచంద్ నటించిన సీటీమార్ సినిమా సెప్టెంబర్ నెల 10వ తేదీన థియేటర్లలో రిలీజ్ కానుంది.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus