కరోనా ఎఫెక్ట్ వల్ల నాగ చైతన్య సినిమాకి కూడా తప్పడం లేదుగా…!

  • August 11, 2020 / 04:12 PM IST

‘ఫిదా’ తో బ్లాక్ బస్టర్ కొట్టి స్ట్రాంగ్ కం బ్యాక్ ఇచ్చాడు దర్శకుడు శేఖర్ కమ్ముల. ఆ చిత్రం తర్వాత కొత్త వాళ్ళతో ఓ సినిమా ప్లాన్ చేసాడు. కానీ కొన్ని కారణాల వల్ల ఆ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. తరువాత నాగ చైతన్య , సాయి పల్లవి లతో ‘లవ్ స్టోరీ’ ప్లాన్ చేసాడు. నిజానికి 2020 సమ్మర్ కే ఈ చిత్రాన్ని విడుదల చెయ్యాలి అని ప్లాన్ చేసాడు. కానీ కుదర్లేదు. కరోనా వైరస్ వల్ల ఈ చిత్రం షూటింగ్ ఆగిపోయింది. షూటింగ్ లకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చినా…వైరస్ మహమ్మారి విజృంభిస్తుండడంతో తిరిగి షూటింగ్ ను మొదలుపెట్టలేదు.

అయితే సెప్టెంబర్ నుండీ ఈ చిత్రం షూటింగ్ ను మొదలుపెట్టడానికి ప్లాన్ చేస్తున్నారని సమాచారం. ఈ నేపధ్యంలో రామోజీ ఫిలింసిటీలో ఓ విలేజ్ సెట్ ను కూడా వేస్తున్నారట. సాధారణంగా స్టార్ హీరోల సినిమాలకు మాత్రమే సెట్స్ వేస్తుంటారు.కానీ కరోనా మహమ్మారి కారణంగా మీడియం రేంజ్ హీరో అయిన చైతన్య సినిమాకి కూడా సెట్ వేయాల్సి వస్తుందట. విలేజ్ సెట్ వెయ్యడం అంటే చాలా ఖర్చు తో కూడుకున్నది అన్న సంగతి తెలిసిందే.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus