Sarkaru Vaari Paata: మహేష్ కి సరైన విలన్ దొరికాడు!

  • July 9, 2021 / 12:00 PM IST

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు-పరశురామ్ కాంబినేషన్ లో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇంకా షూటింగ్ దశలోనే ఉంది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. బ్యాంక్ రుణాల ఎగవేత నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో విలన్ గా సీనియర్ హీరో అర్జున్ ని తీసుకోబోతున్నారంటూ వార్తలు వచ్చాయి.

కానీ ఈ విషయంలో నిజం లేదని తెలుస్తోంది. ఈసారి మహేష్ ని ఢీ కొట్టడానికి టాలెంటెడ్ యాక్టర్ సముద్రఖనిని రంగంలోకి దింపుతున్నారు. ఈ మధ్యకాలంలో సముద్రఖనికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ‘అల.. వైకుంఠపురములో’, ‘క్రాక్’ వంటి సినిమాలు ఆయనకి మంచి గుర్తింపును తీసుకొచ్చాయి. ‘క్రాక్’ సినిమాలో ఆయన రోల్ బాగా పండింది. అందుకే ఆయన్ను ‘సర్కారు వారి పాట’లో కీలక ప్రతినాయకుని పాత్రకు తీసుకున్నట్లు తెలుస్తోంది. లాక్ డౌన్ కారణంగా వాయిదా పడిన ఈ సినిమా షూటింగ్ వచ్చే వారం నుండి పునః ప్రారంభం కానుంది.

ఈ షెడ్యూల్ సుదీర్ఘంగా సాగనుందని సమాచారం. ఈ షెడ్యూల్ ముగిసిన తర్వాత హైదరాబాద్‌లో మరో యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్‌ను ప్లాన్ చేస్తోంది చిత్రబృందం. వీలైనంత త్వరగా షూటింగ్ ను పూర్తి చేసి సంక్రాంతికి సినిమాను విడుదల చేసే దిశగా సన్నాహాలు చేస్తున్నారు.

Most Recommended Video

విజయేంద్ర ప్రసాద్ గారి గురించి 10 ఆసక్తికరమైన విషయాలు..!
ఈ 10 స్పీచ్ లు వింటే ఈ స్టార్లకు ఫ్యాన్స్ అయిపోతారు అంతే..!
నయన్, అవికా టు అలియా.. డేటింగ్ కి ఓకే పెళ్ళికి నొ అంటున్న భామలు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus