రానా – సాయి పల్లవి కూడా రెడీ!

  • January 29, 2021 / 08:12 AM IST

రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటిస్తున్న ఇంట్రెస్టింగ్ మూవీ విరటపర్వం ఓ వర్గం ఆడియెన్స్ లో అంచనలైనయితే బాగానే పెంచేసింది. రానా ఒక నక్సలైట్ లీడర్ గా కనిపించబోతున్న విషయం తెలిసిందే. ఇక ప్రియమణి కూడా ఒక ముఖ్యమైమ పాత్రలో కనిపించనుంది. ప్రస్తుతం సినిమా షూటింగ్ కూడా తుది దశకు చేరుకుంది. ఇక దాదాపు అందరు రిలీజ్ డేట్స్ పై క్లారిటీ ఇస్తుండడంతో విరటపర్వం యూనిట్ కూడా రిలీజ్ డేట్ ను ఎనౌన్స్ చేసింది.

ఎలాంటి పోటీ లేకుండా ఏప్రిల్ 30న సినిమాను రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యింది. మార్చి లోనే విడుదల చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ పనులు అప్పటికీ పూర్తి కావు. ఈ సినిమాను వేణు ఉడుగుల డైరెక్ట్ చేస్తున్నాడు. గతంలో ఈ దర్శకుడు నీది నాది ఒకే కథ అనే సినిమాతో మంచి గుర్తింపును అందుకున్నాడు. ఇక సినిమాలో రానా పాత్ర చాలా పవర్ఫుల్ గా ఉంటుందట. అంతే కాకుండా ఎమోషనల్ గా కూడా టచ్ అవుతుందని టాక్.

సాయి పల్లవి కూడా సినిమాలో నెవర్ బిఫోర్ అనేలా కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇక ఏప్రిల్ మొదటివారానికి సినిమాకు సంబంధించిన మొత్త పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా పూర్తవుతాయి. త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ ను కూడా స్టార్ట్ చేయాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేసుకుంటోంది.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus