Virata Parvam: నేను రానాకి కథ చెప్పలేదు.. రానా పై విరాటపర్వం దర్శకుడి కామెంట్స్ వైరల్..!

  • June 9, 2022 / 11:39 AM IST

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు ఉడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాటపర్వం’. సురేష్ బాబు, సుధాకర్ చెరుకూరి కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. జూన్ 17న ఈ చిత్రం థియేటర్లలో విడుదల కాబోతుంది. దర్శకుడు వేణుకి ఇది రెండో చిత్రం మాత్రమే. మొదటి చిత్రం ‘నీదీ నాదీ ఒకే కథ’ అనే ఓ డీసెంట్ ఎంటర్టైనర్ ను మాత్రమే తీశాడు. అయితే ఈ కథ వేణు రానాకి చెప్పలేదట. కానీ రానా ఈ చిత్రం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించాడట.

దర్శకుడు వేణు ఉడుగుల మాటల్లో.. “నేను ‘విరాటపర్వం’ కథని సురేష్ బాబు గారికి చెప్పాను. సురేష్ బాబు గారు ‘రానాకి లైన్ నచ్చింది చెప్తావా’ అని ఒకసారి నాతో అన్నారు.సరే అని రానా గారికి చెప్పాను. కథ విన్న రానా గారు వెంటనే ఈ కథ నేను చేస్తా అన్నారు. ఇలాంటి కథ రానా ఎందుకు యాక్సెప్ట్ చేశారు అన్న విషయం నాకు కాసేపు అర్థం కాలేదు. ఒక కొత్త దర్శకుడు వైవిధ్యమైన కథతో వచ్చాడు.

ఇలాంటి సినిమా మనం చేయకపోతే ఎవరు చేస్తారనే గొప్ప మనసుతో ఆయన ఒప్పుకున్నారని నేను భావిస్తున్నాను. రానా గారి కోసం నేను ఈ కథలో ఎటువంటి మార్పులు చేయలేదు.ఆయన కూడా మార్పులు చేయండని అడిగే హీరో కాదు.అవసరమైన మార్పులు చేయడం మంచిదే. ఓటీటీ వచ్చిన తర్వాత ప్రేక్షకులు డిఫరెంట్ కంటెంట్ ను ఎంకరేజ్ చేస్తున్నారు.

ప్రేక్షకుల్లో ఫిల్మ్ లిటరసీ బాగా పెరిగింది. ఒక ఆర్ట్ సినిమా తీసి కమర్షియల్ సినిమా అంటే నమ్మే పరిస్థితి లేదు. జనాలకు మంచి కంటెంట్ ఇవ్వాలంటే అవసరమైన మార్పులు చేయడంలో తప్పులేదు” అంటూ వేణు చెప్పుకొచ్చారు.

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus