Rana, Sai Pallavi: ఓటిటి డీల్ క్యాన్సిల్ చేసుకున్న రానా-సాయి పల్లవి ల ‘విరాటపర్వం’..!

  • November 22, 2021 / 04:50 PM IST

రానా హీరోగా సాయి పల్లవి హీరోయిన్ గా వేణు అడుగుల దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘విరాట పర్వం’. ‘నారప్ప’ ‘దృశ్యం2’ వంటి సినిమాల లానే దీనిని కూడా నిర్మాత సురేష్ బాబు ఓటిటికి అమ్మేశారని మొన్నటివరకు ప్రచారం జరుగింది. కానీ దీని గురించి నిర్మాత సురేష్ బాబు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.మరోపక్క ఈ చిత్రానికి సంబంధించి అప్డేట్స్ కూడా రావడం లేదు. మొన్నటికి మొన్న ఈ చిత్రం మ్యూజిక్ డైరెక్టర్ మారిపోయాడు అంటూ వార్తలు వస్తే హీరో రానా రియాక్ట్ అయ్యి క్లారిటీ ఇచ్చాడు తప్ప..

నిర్మాతలు రియాక్ట్ అవ్వలేదు.రానా మిగిలిన సినిమాలకి రియాక్ట్ అవుతూ ట్వీట్లు వేస్తున్నాడు కానీ ‘విరాటపర్వం’ ఊసెత్తడం లేదు. అసలు ఈ చిత్రం షూటింగ్ కంప్లీట్ అయ్యిందా లేదా అనే అనుమానాలు కూడా అవ్యక్తమవుతున్నాయి. ఇదిలా ఉండగా.. తాజా సమాచారం ప్రకారం.. ఈ చిత్రం ఓటిటి డీల్ క్యాన్సిల్ అయ్యిందట. ‘సురేష్ ప్రొడక్షన్స్’ సర్కిల్స్ నుండే ఈ వార్తలు వినిపిస్తున్నాయి. నిజానికి ఓటిటి డీల్ కుదిరిందని చెప్పిందీ వాళ్ళే.. ఇప్పుడు క్యాన్సిల్ అయ్యిందని చెబుతుంది వాళ్ళే.

అంతేకాదు థియేటర్లలోనే ఈ చిత్రం విడుదవుతుందని వారు చెప్పుకొస్తున్నారు. అలాగే ‘భీమ్లా నాయక్’ విడుదలయ్యే వరకు ‘విరాటపర్వం’ బయటకి వచ్చే అవకాశం లేదని కూడా వారు చెబుతున్నారు. డిసెంబర్ 14న రానా పుట్టినరోజు కాబట్టి.. ఆ రోజున ఈ విషయం పై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

పుష్పక విమానం సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ప్రకటనలతోనే ఆగిపోయిన మహేష్ బాబు సినిమాలు ఇవే..!
రాజా విక్రమార్క సినిమా రివ్యూ & రేటింగ్!
3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus