విశాల్ పెళ్లి ఆగిపోయినట్టేనట.. బిజినెస్మెన్ తో అనీషా పెళ్లి..!

  • December 7, 2020 / 10:09 PM IST

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ కు తెలుగులో కూడా అభిమానులు ఉన్న సంగతి తెలిసిందే. ఆయన నటించే సినిమాలు తెలుగులో కూడా డబ్ అవుతూ ఉంటాయి. ఇక ఈ మధ్య కాలంలో వివాదాల్లో కూడా ఎక్కువగా నిలుస్తూ.. మరింతగా వార్తల్లో ఉంటున్నాడు విశాల్. సరే ఈ విషయాలను పక్కన పెట్టేస్తే.. గతేడాది విశాల్ కు ఎంగేజ్మెంట్ అయిన సంగతి అందరికీ తెలిసిందే. అనీషా రెడ్డి అనే అమ్మాయితో హైదరాబాద్లోని ఓ హోటల్లో విశాల్ నిశ్చితార్థం అంగరంగ వైభవంగా జరిగింది.

అయితే వివాహం ఎప్పుడు జరిగేది అధికారికంగా ప్రకటించలేదు. దీంతో విశాల్ వివాహం ఆగిపోయింది అంటూ ప్రచారం మొదలయ్యింది. విశాల్ తండ్రి ఈ వార్తల్లో నిజం లేదు అని తెలిపినా.. ఆ ప్రచారం ఆగలేదు. అయితే అందుతోన్న తాజా సమాచారం ప్రకారం.. అనీషా రెడ్డి పెళ్లి వేరే యువ పారిశ్రామిక వేత్తతో నిశ్చయించారట ఆమె తల్లిదండ్రులు. విశాల్ కు అలాగే అనీషాకు .. మధ్య మనస్పర్థలు రావడంతో వారు విడిపోయారని ఇన్సైడ్ టాక్.

అనీషా రెడ్డి వివాహ తేదీని కూడా త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారని సమాచారం. విశాల్ గతంలో లక్ష్మీ మీనన్ అలాగే వరలక్ష్మీ శరత్ కుమార్ లతో కూడా ప్రేమాయణం నడిపినట్టు కూడా వార్తలు వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఓ దశలో విశాల్ – వరలక్ష్మీ పెళ్లి చేసుకుంటున్నారు అంటూ పెద్ద ఎత్తున ప్రచారం కూడా జరిగింది. అయితే ఈ వార్తలను వాళ్ళు చాలా సార్లు కొట్టిపారేశారు.

1

2

3

4

5

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus