ప్రముఖ నిర్మాత జి.కె.రెడ్డికి దక్కిన అరుదైన గౌరవం..!

  • September 3, 2021 / 10:05 PM IST

విశాల్ తండ్రి, ప్రముఖ నిర్మాత అయిన జి.కె.రెడ్డి తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే.ఈయన తెలుగు వారే. కానీ చెన్నైలో సెటిల్ అయ్యారు. పైగా మన మెగాస్టార్ చిరంజీవితో ‘ఎస్.పి.పరశురామ్’ అనే చిత్రాన్ని కూడా నిర్మించారు.తాజాగా జి.కె. రెడ్డి ఫిట్ ఇండియా అంబాసిడర్‌గా ఎంపికవ్వడం పెద్ద చర్చ నీయాంశం అయ్యింది.అందులో వింతేమి ఉంది అని మీరు అనుకోవచ్చు. దానికి కారణం కూడా అంది. ప్రస్తుతం జి.కె.రెడ్డి వయసు 82 ఏళ్ళు. ఈ వయసులో ఈయన ఫిట్ ఇండియా అంబాసిడర్ ఏంటి అనేది జనాల ప్రశ్న.

వాళ్ళు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు.గతేడాది జి.కె.రెడ్డితో పాటు ఈయన ఫ్యామిలీ మొత్తం కరోనా భారిన పడ్డారు. అయినప్పటికీ వీళ్ళు త్వరగానే కోలుకున్నారు.మరీ ముఖ్యంగా 83 ఏళ్ళ వయసున్న జి.కె.రెడ్డి కూడా అంత త్వరగా కోలుకోవడంతో అందరూ సంబ్రమాశ్చర్యానికి గురయ్యారు. దీనికి కారణం ముందు నుండీ వారు యోగాసనాలు వంటివి చేస్తుండడం.. టెన్షన్లు అవి పెట్టుకోకుండా ఉండడం అని వారు చెప్పుకొచ్చారు. అంతేకాదు అతి కష్టమైనా ఆసనాలు కూడా వేస్తున్న వీడియోలను కూడా ఈయన యూట్యూబ్ లో పోస్ట్ చేశారు.

ఆ వీడియో పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది కూడా.! జి.కె.రెడ్డి లుక్ చూసిన వాళ్ళు కూడా ఆశ్చర్యపోతూనే ఉన్నారు. తన కొడుకులకు ధీటుగా ఆయన కండలు తిరిగిన దేహంతో కనిపిస్తుండడం విశేషం. ఇక ఇదే విషయం పై విశాల్ కూడా స్పందించి తన తండ్రిని కంగ్రాట్యులేట్ చేయడం విశేషం.

Most Recommended Video

చాలా డబ్బు వదులుకున్నారు కానీ ఈ 10 మంది యాడ్స్ లో నటించలేదు..!
గత 5 ఏళ్లలో టాలీవుడ్లో రూపొందిన సూపర్ హిట్ రీమేక్ లు ఇవే..!
రాజ రాజ చోర సినిమా రివ్యూ& రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus