మామగారితో గొడవ సద్ధుమణిగిందా ?

  • February 10, 2018 / 01:07 PM IST

నడిగర్ సంఘం కార్యదర్శి, తమిళ నిర్మాతల మండలి అధ్యక్షుడు, ప్రముఖ నటుడు విశాల్‌ పెళ్లిపీటలెక్కనున్నాడు. ఈ విష‌యాన్ని ఆయ‌న స్వ‌యంగా వెల్ల‌డించాడు..చెన్నైలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. “నడిగర్ సంఘం నూతన భవన నిర్మాణం వేగంగా జరుగుతోంది, డిసెంబర్ నాటికి ఈ భవన నిర్మాణం పూర్తవుతుందని, వ‌చ్చే ఏడాది జనవరిలో ప్రారంభోత్సవం ఉంటుంది. పనిలో పనిగా ఆ భవనంలోని కళ్యాణ మండపంలో జరిగే తొలి పెళ్లి నాదే” అన్నాడు. ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చి మండపాన్ని బుక్ చేసుకున్నానని కూడా తెలిపాడు.

అయితే వధువు ఎవరు? అన్నది మాత్రం సీక్రెట్ గా ఉంచాడు. కాగా, శరత్ కుమార్ కుమార్తె వరలక్ష్మితో విశాల్ ప్రేమలో ఉన్నాడు. ఆమెనే పెళ్లి చేసుకోనున్న‌ట్లు టాక్. కానీ.. నడిగర్ సంఘం ఎలెక్షన్స్ టైమ్ లో శరత్ కుమార్ తో గొడవపడ్డ విషయం తెలిసిందే. మరి విశాల్ ఈ రేంజ్ లో ఓపెన్ గా స్టేట్ మెంట్ ఇచ్చాడంటే.. శరత్ కుమార్ తో గొడవలు సద్దుమణిగాయా, లేక ఇంట్లో వాళ్ళతో చెప్పకుండా సీక్రెట్ గా మ్యారేజ్ చేసుకోవాలనుకొంటున్నాడో అనే విషయంలో క్లారిటీ కావాలంటే ఇంకొన్నాళ్లు ఆగాల్సిందే.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus