‘సీనయ్య’ మూవీ గురించి వినాయక్ ఆసక్తికరమైన కామెంట్స్..!

  • October 21, 2020 / 08:16 PM IST

టాలీవుడ్ దర్శకులలో వి.వి.వినాయక్ కు చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. ప్రేక్షకుల్లోనే కాదు.. ఆయనతో పని చేసిన ప్రతీ హీరో కూడా మళ్ళీ మళ్ళీ అతనితో సినిమా చెయ్యాలని ఆశపడుతుంటాడు. ప్రస్తుతం వినాయక్.. మెగాస్టార్ చిరంజీవితో ‘లూసిఫర్’ చిత్రాన్ని రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యారు. అందుకోసం ఆయన స్క్రిప్ట్ పనుల్లో బిజీగా గడుపుతున్నారు. ఇదిలా ఉండగా.. గతేడాది వినాయక్ హీరోగా మారుతూ ఓ చిత్రం చెయ్యాలని భావించారు. ఎన్.నరసింహ రావు ఈ చిత్రాన్ని డైరెక్ట్ చెయ్యాల్సి ఉంది.

సక్సెస్ ఫుల్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మాత. ఈ చిత్రానికి సంబంధించి ఫస్ట్ లుక్ కూడా విడుదలయ్యింది. అయితే కొన్ని కారణాల వల్ల ఈ చిత్రం ఆగిపోయిందనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రం గురించి వినాయక్ కొన్ని ఆసక్తికరమైన కామెంట్లు చేసాడు. ఆయన మాట్లాడుతూ.. “ఒకరోజు దిల్ రాజు గారు నా దగ్గరకు వచ్చి.. ‘నువ్వు నన్ను దిల్ రాజుని చేసావు. నేను నిన్ను హీరోని చేద్దాం అనుకుంటున్నాను.. నీకు కూడా కొత్త ఎక్స్పీరియన్స్ ఉంటుంది చెయ్యి’ అని చెప్పారు.

ఆయన చాలా అనుభవం ఉన్న నిర్మాత.. కచ్చితంగా బాగా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకుని ఉంటారు అని నాకు అనిపించింది. సరే నేను కూడా ఆ విధంగా అయినా సన్నబడొచ్చులే అని ‘శీనయ్య’ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాను.కానీ ఏదో ఒక ఆటంకం రావడం వల్ల షూటింగ్ జరగట్లేదు. ఆ సినిమా వస్తుందో లేదో నాకు తెలీదు” అంటూ చెప్పుకొచ్చాడు వినాయక్.

Most Recommended Video

టాలీవుడ్ లో తెరకెక్కిన హాలీవుడ్ చిత్రాలు!
బిగ్‌బాస్‌ ‘రౌడీ బేబీ’ దేత్తడి హారిక గురించి ఈ విషయాలు మీకు తెలుసా?
రజినీ టు ఎన్టీఆర్.. జపాన్ లో కూడా అదరకొట్టిన హీరోలు వీళ్ళే..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus