వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ ల మధ్య గొడవకు కారణం అదే…!

  • August 11, 2020 / 04:30 PM IST

కోలీవుడ్ లో ట్యాలెంటడ్ హీరోయిన్స్ గా క్రేజ్ ను సంపాదించుకున్నారు మన వరలక్ష్మీ శరత్ కుమార్… మరియు ఐశ్వర్య రాజేష్ లు. వీళ్లిద్దరి మధ్య గొడవేంటి అని కంగారు పడుతున్నారా? కంగారు పడకండి… అది నిజ జీవితంలో కాదు. ఓ వెబ్ సిరీస్ లో …! అవును ఈ లాక్ డౌన్ టైంలో ఓటిటికి బాగా డిమాండ్ పెరిగిన సంగతి తెలిసిందే. స్టార్ హీరోయిన్స్ అయిన సమంత ఇప్పటికే ‘ఫ్యామిలీ మెన్’ సీజన్ 2 వెబ్ సిరీస్ లో నటిస్తుంది.

ఇక మరో స్టార్ హీరోయిన్ కాజల్ కూడా తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు రూపొందిస్తున్న ఓ వెబ్ సిరీస్ లో నటిస్తుంది.నిత్యా మేనన్ వంటి క్రేజీ హీరోయిన్ కూడా వెబ్ సిరీస్ లకు ఓకే చెప్పింది. ఇప్పుడు ఇదే కోవలో మన వరలక్ష్మీ శరత్ కుమార్, ఐశ్వర్య రాజేష్ కూడా ఓ వెబ్ సిరీస్ లో నటిస్తున్నారు.దీని కథ ప్రకారం..

ఇద్దరు సవతుల మధ్య జరిగే గొడవలతో సాగుతోందట. ఇలా నెగిటివ్ టచ్ ఉన్న పాత్రల్లో అయితే … యాక్టింగ్ కు మంచి స్కోప్ ఉంటుందని ఈ ఇద్దరు భామలు యెస్ చెప్పినట్టు తెలుస్తుంది. ఇక ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Most Recommended Video

‘ఉమామహేశ్వర ఉగ్రరూపస్య’ హీరోయిన్ రూప గురించి మనకు తెలియని విషయాలు..!
పోకిరి మూవీలో పూరిజగన్నాథ్ సోనూసూద్ నీ హీరోగా అనుకున్నాడట!
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus